Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘యాత్ర 2’పై దర్శకుడి అప్డేట్: వైఎస్ రాజారెడ్డి, జగన్ లేకుండా పూర్తి కాదు!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై 'యాత్ర' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ త్వరలో 'యాత్ర 2' చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఈ సీక్వెల్ ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా గురించి మహి వి రాఘవ్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్ లేకుండా వైఎస్సార్ కథకు ముగింపు ఉండదని స్పష్టం చేశారు. 'యాత్ర 2' ఈ ముగ్గురి స్టోరీతో ముగుస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
సీక్వెల్ తీసే ఉద్దేశ్యం ఇంతకు ముందే ఉందని, అందుకే 'యాత్ర' సినిమాను జగన్ ప్రస్తావనతోనే ముగించినట్లు మహి వి రాఘవ్ తెలిపారు. వైఎస్సార్ యాత్ర ఆయన తండ్రి సమాధి నుంచి మొదలైంది. జగన్ యాత్ర తన తండ్రి సమాధి నుంచి ప్రారంభమైందని ఈ సందర్భంగా దర్శకుడు గుర్తు చేశారు. ఇదే 'యాత్ర 2'లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
జగన్ పాదయాత్ర మొదలు... 2019లో అతడు అధికారంలోకి వచ్చే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఫోకస్ చేస్తూ 'యాత్ర 2' ఉంటుందని టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 175 సీట్లకుగాను 151 సీట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే 'యాత్ర 2' ఎప్పుడు వస్తుందనే విషయాలను మాత్రం మహి వి రాఘవ్ తెలుపలేదు. 'యాత్రా 2' స్టోరీ రాయడం ప్రారంభిస్తాను, త్వరలోనే సినిమా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అనే ప్రకటన మాత్రమే చేశారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.