Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ మళ్లీ ముంబై బ్యాక్ డ్రాప్
హైదరాబాద్: మహేష్ ,పూరి కాంబనేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు ...తన కొత్త చిత్రానికి ముంబై బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నట్లు సమచారం. ఆ చిత్రం మరేదో కాదు...మురుగదాస్ తో చేస్తున్న చిత్రం.
బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్న మహేష్ ..తన తదుపరి చిత్రంగా మురుగుదాస్ సినిమా ని ఓకే చేసారు. ఈ చిత్రం పూర్తి కాగానే కొద్ది పాటి గ్యాప్ తో ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ కు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి.
సుమారు 100 కోట్ల బడ్జేట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, సోషల్ రెస్పాన్స్ బెలిటి మీదే ఈ కథ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లోకేషన్స్ కోసం మురుగుదాస్, కెమెరామెన్ సంతోష్ శివన్ ముంబాయి పరిసర ప్రాంతలు తిరుగుతున్నారు. ఇది ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఈ సినిమాకు ఠాగుర్ మధు మరియు ఎన్.వి. ప్రశాద్ లు ప్రోడ్యుసర్స్ గా ఉన్నారు. హీరోయిన్ కోసం ఇంకా వేటలోనే ఉన్నారు. కుదిరితే కనుక బాలివుడ్ భామ శ్రద్దా కవూర్ ని తీసుకోవడం పై పరీశీలిస్తున్నారు.
మురుగదాస్ గతంలో తమిళంలో తీసిన రమణ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో... ‘ఠాగూర్' పేరుతో రీమేక్ చేసారు. తర్వాత మురుగదాస్, చిరంజీవి కాంబినేషన్లో ‘స్టాలిన్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరూ కలిసి మరో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకున్నారు.
చిరంజీవిని మైండ్ లో పెట్టుకుని మురుగదాస్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారు. అయితే చిరంజీవికి ఆ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసారు. మురుగదాస్ అదే స్టోరీని మహేష్ బాబుకు చెప్పాడని, మహేష్ బాబుకు నచ్చడంతో ఓకే చేసారని అంటున్నారు. హైకోర్ట్ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్.