Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క కెరీర్ను నాశనం చేయాలనుకున్నదెవరు?
ముంబై: బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ తో పాటు అనుష్క శర్మ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఒకప్పుడు ఇదే కరణ్ జోహార్ అనుష్క కెరీర్ నాశనం చేయాలనుకున్నాడట.
మామి ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ మసంద్తో జరిగిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. యశ్రాజ్ ఫిలింస్ వారు షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'రబ్ నే బనాదీ జోడీ' సినిమా ద్వారా అనుష్క శర్మ హీరోయిన్ గా పరిచయం అయింది.
అనుష్కను తీసుకునే ముందు... అపుడు యశ్ రాజ్ ఫిలింస్ వైస్ ప్రెసిడెంటుగా ఉన్న ఆదిత్య చోప్రా.... అనుష్క శర్మ ఫోటోలను కరణ్ జోహార్ కు చూపించారట. అయితే కరణ్ కు ఆమె నచ్చలేదు, అనుష్కను తీసుకోవద్దని సూచించాడట.
అయితే ఆదిత్య చోప్రా.... కరణ్ జోహార్ సూచన పట్టించుకోకుండా అనుష్క శర్మను ఆ సినిమాకి తీసుకున్నాడు. అయితే బ్యాండ్ బాజా బారాత్ సినిమా విడుదలయ్యాక అనుష్కలోని టాలెంట్ ను గుర్తించి తాను.... ఆమె గురించి పూర్తిగా తెలుసుకోకుండా అనవసరంగా ఆమె కెరీర్ నాశనం చేయాలనుకున్నాను అని పీలయ్యాడట కరణ్ జోహార్.