twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెబిసి షో: 7 కోట్లు గెలుచుకున్న క్యాన్సర్ బాధితురాలు

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి 8' కార్యక్రమంలో తాజాగా మరో సంచలనం చోటు చేసుకుంది. క్యాన్సర్‌తో బాధ పడుతున్న మేఘా పాటిల్ అనే మహిళ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ. 7 కోట్ల ఫ్రైజ్ మనీ గెలుచుకుంది.

    ‘కౌన్ బనేగా కరోడ్ పతి' చరిత్రలో ఒక మహిళ ఇంత పెద్ద మొత్తం గెలుచుకోవడం ఇదే తొలిసారి. మేగా పాటిల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కొన్ని నెలల్లో ఆమె చనిపోబోతోంది. సాధారణ గృహిణి అయిన ఆమె...ఇంట్లో ట్యూషన్లు చెబుతుంటారు.

    KBC 8 gets its first female crorepati winner!

    ‘కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం అంటే మేఘ పాటిల్‌కు ఎంతో ఇష్టం. పట్టుదలతో ప్రయత్నించి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అక్కడ ఫాస్టెస్ట్ ఫంగర్ రౌండ్ దాటి హాట్ సీటు వరకు వచ్చి...అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి పూర్తి ఫ్రైజ్ మనీ రూ. 7 కోట్లు దక్కించుకుంది.

    క్యాన్సర్ కారణంగా చావుకు దగ్గరైనా.....ఏ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఆమె ఈ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

    English summary
    KBC 8 gets its first female crorepati winner. The lucky contestant to win this huge sum is Megha Patil, a housewife and tuition teacher from Vasai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X