Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హుధూద్: రజనీకాంత్ రూ. 5 లక్షల విరాళం
హైదరాబాద్: హుధూద్ తుఫాన బాధితుల సహాయార్థం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నిధికి చెక్కు పంపారు. రజనీకాంత్ నిర్వహిస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు తరుపున ఆయన ఈ విరాళం అందజేసారు.
ఇటీవల కాలంలో ఉత్తరాంద్రా జిల్లాల్లో జరిగిన హుద్హుధ్ ప్రకృతి వైపరిత్యానికి సపోర్టు గా టాలీవుడ్ అంతా కలిసి చేసిన మేముసైతం పోగ్రాం లో సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ తాను కూడా పార్టిసిపేట్ చెయ్యవలసిందని, కాని సేమ్ డే ఇంపార్టెంట్ ఫ్యామిలి ఫంక్షన్ వుండటం వలన రావటం కుదరలేదని ఇటీవలే తన చిత్రం లింగా ఆడియో సక్సస్ లో ఆయన చెప్పారు.
అయితే ఈ ప్రకృతి భీపత్సం జరిగినప్పుడు తన మనసు చాలా భాదపడిందన్నారు. దీని వలన ఏన్నో కుటుంబాలు దిక్కుతోచని విధంగా తయారయ్యాయి అన్నారు. ఇంత పెద్ద తుఫానుని తానెప్పుడూ చూడలేదని కూడా బాధపడ్డారు. అయితే ఆ భగవంతుడు తనకు తోచిన విధంగా చేసుకుపోతుంటాడు. దానికి మనం శిరస్సు వంచటం తప్ప ఏమి చేయలేమని, తన వంతు సాయం చేయటం మానవ లక్షణం అని అందుకే తన వంతు సహయం గా 5 లక్షల రూపాయిలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహయ నిధికి చెక్ ని అందిస్తున్నాను అన్నారు.