Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సరైనోడు’ స్పెషల్ సాంగు ఖర్చు రూ. కోటిన్నర, కారణం ఇదే!
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగు కోసం రూ. కోటిన్నర విలువ చేసే సెట్ వేసారు.
‘అల్లు అర్జున్, కేథరిన్ లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీరిస్తున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల స్థలంలో రూ. కోటిన్నర ఖర్చు పెట్టి సెట్ వేసారు. ఈ సాంగులో దాదాపు 300 మంది డాన్సర్లు బ్యాగ్రౌండ్లో స్టెప్పులేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సాంగ్ చిత్రీకరణ పూర్తి కాబోతోంది' అని యూనిట్ సభ్యులు తెలిపారు.
పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్ చిత్రీకరణలో అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్లను కూడుతున్నారు. ఇందుకోసం వాటిని ప్రత్యేకంగా రెంటుకు తెప్పించారు. సాంగ్ చాలా బాగా వస్తోందని, సినిమాలో ఇది హైలెట్ అవుతుందని అంటున్నారు.
బన్నీ సొంత బేనర్లో... ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భగా ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.