Don't Miss!
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్రైజర్స్ హైదరాబాద్పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కులాన్ని అవమానించారు: తెలంగాణలో ‘బాహుబలి’ అడ్డుకుంటాం
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మాల కులస్తులను అవమాన పరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేసారు.
సినిమాలో ఆ సీన్లను వెంటనే తొలగించక పోతే తెలంగాణలో ఆ సినిమాను అడ్డుకుంటామని దీపక్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు మాలలను కించపరుస్తూ ప్రసారమైన వీడియో క్లిప్పింగులను యూట్యూబ్ ద్వారా సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దీపక్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.