twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కులాన్ని అవమానించారు: తెలంగాణలో ‘బాహుబలి’ అడ్డుకుంటాం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మాల కులస్తులను అవమాన పరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేసారు.

    సినిమాలో ఆ సీన్లను వెంటనే తొలగించక పోతే తెలంగాణలో ఆ సినిమాను అడ్డుకుంటామని దీపక్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు మాలలను కించపరుస్తూ ప్రసారమైన వీడియో క్లిప్పింగులను యూట్యూబ్ ద్వారా సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దీపక్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

    Telangana Mala JAC complaint against Bahubali movie

    ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

    English summary
    Telangana Mala JAC complaint against Bahubali movie. They demands for removal of some scenes in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X