Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కబీర్ సింగ్ తర్వాత మరో బాలీవుడ్ సినిమాతో సందీప్ రెడ్డి.. క్రేజీ హీరో ఎవరో తెలుసా?
Recommended Video
టాలీవుడ్లో అర్జున్ రెడ్డి, బాలీవుడ్లో కబీర్ సింగ్తో సత్తా చాటుకొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి మరో చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కబీర్ సింగ్తో బాలీవుడ్ వర్గాలను ఆకట్టుకొన్న ఈ యంగ్ డైరెక్టర్ మళ్లీ హిందీ సినిమా చేస్తాడా? లేక తెలుగులోనే మరో సినిమాను ప్లాన్ చేస్తాడా? అనే ప్రశ్నలు సినీ వర్గాలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాలో ఓ కథనం ఆసక్తిని కలిగించింది. ఆ కథనం సారాంశం ఏమిటంటే..
బాలీవుడ్లో
సందీప్
రెడ్డి
వంగా
సరికొత్త
ప్రయోగం..
ఏ
దర్శకుడు
చేయని
రీతిలో.!
కబీర్ సింగ్తో సత్తా చాటిన సందీప్
అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం కబీర్ సింగ్తో బాలీవుడ్లో అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగాకు గట్టి ప్రతికూలత ఎదురైంది. కబీర్ సింగ్పై దారుణంగా రివ్యూలు రాయడంతో ఇక సినిమా పని అయిపోయిందనుకొన్నారు. కానీ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో భారీ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.372.30 కోట్లు సాధించడంతో సందీప్ రెడ్డి స్టామినా ఏంటో బాలీవుడ్ వర్గాలకు అర్ధమైంది.
రణ్బీర్ కపూర్తో మూవీ
కబీర్ సింగ్ తర్వాత యువ హీరోలందరూ సందీప్ రెడ్డితో సినిమా చేయాలని చూస్తున్నారంట. అయితే తాజాగా సందీప్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో రణ్బీర్ కపూర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించనున్నట్టు బాలీవుడ్ పత్రిక పేర్కొన్నది.
భూషణ్ కుమార్ నిర్మాతగా
కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందించే సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల భూషణ్ ఆఫీస్లో రణ్బీర్ కపూర్ కనపడటంతో ఈ సినిమా పక్కా అని నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా బడ్జెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి చర్చించినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో భూషణ్ కుమార్, రణ్బీర్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో సినిమాకు రంగం సిద్ధమైంది.
బిజీ బిజీగా రణ్బీర్ కపూర్
ప్రస్తుతం రణ్బీర్ సింగ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలియాభట్తో కలిసి బ్రహ్మాస్త్ర, షంషేరా, లవ్ రంజన్ రూపొందించే సినిమాలో అజయ్ దేవగన్, దీపికా పదుకొన్తో కలిసి నటించనున్నారు. ఈ మూడు సినిమాలతోపాటు సందీప్ రెడ్డి సినిమా కూడా షూట్ జరుపుకొంటుందని తెలిసింది.