Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘టెంపర్’ రీమేక్ తెలుగులో రిలీజ్ చేయడం వెనుక విశాల్ ధైర్యం ఇదేనట
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో 'టెంపర్' మూవీ ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఈ సినిమానే తారక్ను నిలబెట్టింది. అంతేకాదు, అప్పటి నుంచి అతడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తారక్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు.
తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇటీవల తమిళంలో రీమేక్ చేశారు. 'అయోగ్య' అనే పేరుతో రీమేక్ అయిన ఈ సినిమాలో విశాల్ హీరోగా నటించగా, అతడికి జోడీగా రాశీ ఖన్నా చేసింది. 'ఠాగూర్' మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన 'అయోగ్య'.. తమిళంలో బంపర్ హిట్ సాధించింది.
దీంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'అయోగ్య' తెలుగు హక్కుల్ని సార్థక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమా తెలుగు అనువాదం కూడా దాదాపుగా పూర్తైపోయింది. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 27న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమాను రీమేక్ చేసి, మళ్లీ విడుదల చేయాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో చిత్ర బృందం అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో ఒకటి విశాల్ మార్కెట్ తెలుగులో బలంగా ఉండడంతో పాటు మరీ ముఖ్యంగా ఈ సినిమా కథలో మార్పులు చేయడమేనట. 'టెంపర్'తో పోల్చితే 'అయోగ్య'లో చాలా మార్పులు ఉన్నాయట. అందుకే ఇక్కడ సినిమాను ఆదరిస్తారని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతున్నట్లు తెలిసింది.