Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ కథ విజయ్ దేవరకొండకు నచ్చలేదా!
విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో గత ఏడాది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంలో అద్భుత నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ గత ఏడాది రెండు సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు. అందులో గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు ఉన్నాయి. గీత గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. టాక్సీవాలా ఎలాంటి అంచనాలు లేకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాలు చేసేందుకు స్టార్ దర్శకులంతా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండని కాకినాడలో కలసి కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ పూరి జగన్నాథ్ సడెన్ గా హీరో రామ్ తో సినిమా ప్రారంభించేశాడు. దీని గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ సిద్ధం చేసిన కథ విజయ్ దేవరకొండకు నచ్చిందట. కానీ తనకు అభిమానుల్లో పెరిగిన అంచనాల నేపథ్యంలో ఈ కథ సరికాదని భావించాడట.
దీనితో పూరి జగన్నాథ్ హీరో రామ్ తో అదే కథని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ఖరారు చేశారు. పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. విజయ్ కోసం పూరి జగన్నాథ్ సిద్ధం చేసిన కథ ఇస్మార్ట్ శంకర్ కాదని, వీరిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా ఉంటుందని అంటున్నారు.