Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షూటింగ్లో గాయపడ్డ వరుణ్ తేజ్ హీరోయిన్.. ఏం జరిగిందంటే!
బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ సినిమా షూటింగ్లో గాయపడింది. మలంగ్ సినిమాలో హీరో అదిత్యరాయ్ కపూర్తో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలంగ్ సినిమా షూటింగ్లో గాయపడిన దిశాపటానీకి హస్పిటల్కు తరలించి చికిత్స అందించారు అని బాలీవుడ్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. గాయం తర్వాత వెంటనే షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. కాగా, దిశాపటానీ గాయపడటం ఇటీవల ఇది రెండోసారి.
సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రంలో పాట షూటింగ్ సందర్భంగా గాయాల పాలైంది. ఆ సందర్భంగా దిశా పటానీ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నేను బాగా కష్టపడిన పాట ఇదే. భారత్ సినిమా కోసం పాటలో కాలికి గాయమైంది. కష్టమైన స్టెప్పులు వేయడంతో కాలు బెణికింది అని తెలిపింది.
ఇక మలంగ్ సినిమా విషయానికి వస్తే.. భారీ ఫైట్స్ సీన్లలో దిశా పటానీ నటిస్తున్నది. ఈ సందర్భంగానే ఆమె గాయపడిందని తెలిసింది. మలంగ్ యాక్షన్ ప్రధాన చిత్రంగా రూపొందుతున్నది. ఈ సినిమా కోసం ఆదిత్య రాయ్ కపూర్ ప్రత్యేకంగా ఈతలో శిక్షణ పొందారు. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కునాల్ కేము, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఇక దిశాపటానీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించింది. ఎంఎస్ ధోని చిత్రంతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది.