డ్రగ్స్ కేసుపై తొలిసారి స్పందన: నెలల పాటు డిప్రెషన్లో ఛార్మి, కుటుంబం
Recommended Video
టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు సినిమా పరిశ్రమను ఒక కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరోయిన్ ఛార్మి కౌర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇతర స్టార్లతో పాటు ఛార్మిని కూడా పోలీసులు విచారించారు.
2017లో సంచలనం రేపిన ఈ కేసులో ఛార్మితో పాటు రవితేజ, పూరి జగన్నాథ్, తరుణ్, నవదీప్, చిన్నా, శ్యామ్ కె నాయుడు, తనీష్, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) విచారించాచరు. ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల గురించి ఛార్మి తొలిసారి స్పందించారు.

నా జీవితంలో అత్యంత దారుణమైన దశ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఛార్మి డ్రగ్స్ కేసు విషయమై ఛార్మి రియాక్ట్ అవుతూ తన జీవితంలో అత్యంత చెత్త సంఘటనగా పేర్కొన్నారు. ఈ కేసు మూలంగా తనతో పాటు తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందని, కొన్ని నెలల పాటు తామంతా డిప్రెషన్లో ఉన్నామని తెలిపారు.

తప్పు చేయలేదు కాబట్టే కడిగిన ముత్యంలా బయటకు వచ్చా
నేను ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయను అని మా కుటుంబ సభ్యులు పూర్తిగా నమ్మారు. ఆ సమయంలో నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా పేరు ఇందులోకి ఎలా వచ్చిందో తెలియదు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను అని తెలిపారు.

18 ఏళ్ల వయసు నుంచి నన్ను ఇదే విషయం అడుగుతున్నారు
ఛార్మి కౌర్ శుక్రవారం(మే 17)తో 31వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయం అడిగితే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నా 18వ ఏట నుంచి నన్ను ఇదే విషయం ప్రతిసారి అడుగుతున్నారు. నాకు పెళ్లిపై ఆసక్తి లేదు, దాని గురించి అసలు ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.

నిర్మాణ రంగంలో ఛార్మి
ప్రస్తుతం చార్మి నటించడం కంటే సినిమా నిర్మాణ రంగంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. 2015లో వచ్చిన ‘మంత్ర 2' తర్వాతి నుంచి ఆమె నటనకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











