Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
It's official: ఎన్సీబీ సమన్లతో రకుల్ ప్రీత్ కు ‘డ్రగ్స్’ దెబ్బ..రియా చక్రవర్తితో ఇరుక్కుపోయింది అలా
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ దర్యాప్తులో దక్షిణాది అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం సంచలనం రేపింది. రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జరిపిన లోతైన విచారణలో రకుల్, సారా ఆలీ ఖాన్ పేర్లు బయటకు రావడం సినీ పరిశ్రమలను కదిపేసింది.
అయితే తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని ఫిర్యాదు చేస్తూ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ సప్లయర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఎన్సీబీ అధికారికంగా సమన్లు జారీ చేయడంతో మరోసారి సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ కేసులో రకుల్ ఎలా ఇరుక్కుపోయారంటే..
రకుల్
ప్రీత్
సింగ్,
దీపిక,
సారా,
శ్రద్దాలకు
నోటీసులు..
24న
విచారణకు
ఎన్సీబీ
ఆదేశాలు
రియా చక్రవర్తితో సన్నిహితంగా
డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులు. వారిద్దరూ ముంబైలో ఒకే జిమ్లో వర్కవుట్లు చేస్తారు. కామన్ ఫ్రెండ్స్ పార్టీల్లో కలిసి పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. అయితే రియా చక్రవర్తికి టాలెంట్ మేనేజర్ జయ సాహా మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్ లీక్ కావడంతో రకుల్ ప్రీత్కు ఉన్న సంబంధాలు బయటకు వచ్చాయి.
జయ సహా విచారణలో అనూహ్యంగా పేర్లు తెరపైకి
రియా, సుశాంత్ మేనేజర్ జయ సాహా వాట్సప్ ఛాటింగ్పై దృష్టిపెట్టడంతో రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్, దీపిక పదుకోన్ పేర్లు అనూహ్యంగా పైకి వచ్చాయి. అయితే తన పేరు ఎన్సీబీ విచారణలో బయటపడటంతో రకుల్ ప్రీత్ ఆందోళనకు లోనయ్యారు. ఆ క్రమంలో లీగల్ నిపుణులతో చర్చలు జరిపారు.
కోర్టు ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్
రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. తనకు, డ్రగ్స్ సంబంధాలపై వస్తున్న మీడియా కథనాలపై నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మీడియా చట్టాలకు లోబడి కథనాలు ప్రసారం, ప్రచురించాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏదైనా వస్తే వార్త కథనాలపై స్పందించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
Recommended Video
సెప్టెంబర్ 24న విచారణకు రకుల్ ప్రీత్ సింగ్
గత కొద్దికాలంగా మీడియాలో చేలరేగిన ఊహగానాలకు అనుగుణంగా రకుల్ ప్రీత్ సింగ్కు నార్కోటిక్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. జారీ చేసిన సమన్ల ప్రకారం.. రకుల్ ప్రీత్ సింగ్, సైమన్ కంబాట్టాను సెప్టెంబర్ 24న విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షూటింగులో ఉన్న రకుల్ ప్రీత్ ముంబైకి చేరుకొనేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది.