Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
GodFather సీక్వెల్పై మోహన్ రాజా క్లారిటీ.. చిరంజీవి మాటలకు సపోర్ట్గా..
మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్గా రూపొందిన గాడ్ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదిన విడుదలకు సిద్దమైంది. అయితే మలయాళంలో ఈ సినిమాకు సీక్వెల్ సిద్దమవుతున్నది. అయితే తెలుగులో కూడా గాడ్ఫాదర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో గాడ్ఫాదర్ సీక్వెల్కు స్కోప్ ఉందనే మాటను స్వయంగా చిరంజీవి ముంబై ప్రెస్మీట్లో చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మోహన్ రాజా గాడ్ఫాదర్ సినిమా రీమేక్పై వివరణ ఇస్తూ..
గాడ్ ఫాదర్ సినిమా బ్రహ్మండంగా వచ్చింది. ఈ సినిమా రీమేక్ చేయాలనే ఆలోచన గత రెండు రోజులుగా వస్తున్నది. ఈ సినిమాలో రెండు రకాల క్యారెక్టరైజేషన్ ఉంటాయి. పవర్ గేమ్తో కథ సాగుతుంది. ఈ కథలో పవర్ వచ్చిన తర్వాత.. ఏం జరిగింది? ప్రస్తుతం మలయాళంలో స్క్రిప్టు వర్క్ జరుగుతున్నది. మరో వండర్ఫుల్ సినిమా చేయడానికి స్కోప్ ఉంది. ఈ సినిమా రీమేక్కు మంచి స్కోప్ ఉంది. గాడ్ఫాదర్ సినిమా రిలీజ్ గురించే ఆలోచిస్తున్నాను.
గాడ్ఫాదర్కు సీక్వెల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి.. క్లైమాక్స్లో కొన్ని సీన్లను అందుకు తగినట్టుగా తీశాం. కంటిన్యూటి కోసం అలా ప్లాన్ చేశాం. బ్రహ్మ క్యారెక్టర్ కోసం ఇంటర్పోల్ వెతికే సీన్లు ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకొందాం అని మోహన్ రాజా అన్నారు. అయితే తన దృష్టి అంతా అక్టోబర్ 5వ తేదీపై ఉంది. ఆ తర్వాతే నేను వివరంగా చాలా విషయాలు షేర్ చేసుకొంటాను అని అన్నారు.