'లోఫర్' ట్రైలర్ రికార్డ్...పూరీ ధాంక్స్
హైదరాబాద్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్తేజ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం 'లోఫర్'. ఇటీవల యూట్యూబ్లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్ను పది లక్షల మందికి పైగా ఆన్లైన్లో చూసారు. ఇందుకుగాను దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
1 Million views so far for Loafer Trailer thank you guys !!
Posted by Puri Jagannadh on 17 November 2015
సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కించిన ఈ చిత్రంలో రేవతి, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ ట్రైలర్ ని మరోసారి చూడాలంటే ఇక్కడ చూడండి.
సి.కల్యాణ్ మాట్లాడుతూ ''వరుణ్ తొలిసారి చేస్తున్న మాస్ సినిమా ఇది. యాక్షన్తో పాటు, సెంటిమెంట్కీ ప్రాధాన్యం ఉంది. కథానుసారమే టైటిల్ నిర్ణయించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది.
బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్ రుషి, సంపూర్ణేష్బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్, ఉత్తేజ్, భద్రమ్ తదితరులు నటించారు. సంగీతం: సునీల్ కశ్యప్. ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











