Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరి జగన్నాథ్ని మబ్బులు కమ్మేశాయి.. ఆ మబ్బులు ఎవరో మీరే అర్థం చేసుకోండి.. నటి హేమ!
నటి హేమ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ దూసుకుపోతోంది. సోదరి, వదిన, తల్లి లాంటి పాత్రలకు హేమ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అప్పుడప్పుడూ సినీ పరిశ్రమ కార్య్రకమాల్లో కూడా హేమ చురుకుగా పాల్గొంటుంది. ఏదైనా విషయం గురించి మాట్లాడే సమయంలో హేమ ఎలాంటి తడబాటు లేకుండా తన అభిప్రాయాలని ధైర్యంగా చెబుతుంది. తాజాగా హేమకి సంబందించిన ఓ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తుంటే హేమ ఈ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పద అంశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
వినయ విధేయ రామతో నిరూపించా
ఈ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ తానేంటో ఇదివరకే ఇండస్ట్రీలో నిరూపించానని హేమ అన్నారు. హీరో, దర్శకుల కోసం 100 టికెట్స్ అమ్ముడైతే, నా కోసం కనీసం 15 టికెట్స్ అయినా అమ్ముడవుతాయని హేమ తెలిపింది. నా కోసం కూడా సినిమా చూసే ప్రేక్షకులను ఉన్నారని హేమ తెలిపింది. ఆ విషయాన్ని వినయ విధేయ రామ చిత్రంతో కూడా నిరూపించానని హేమ తెలిపింది. వినయ విధేయ రామ చిత్రంలో హీరోయిన్ కియారా అద్వానీ తల్లిపాత్రలో హేమ నటించిన సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్తో విభేదాలు
గతంలో త్రివిక్రమ్ చేసే ప్రతి చిత్రంలో హేమ ఉండేవారు. ఇప్పుడు ఆయనతో విభేదాలు ఎందుకు వచ్చాయి అని యాంకర్ ప్రశ్నించగా హేమ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. రెమ్యునరేషన్ విషయంలో ఆయనతో విభేదాలు వచ్చాయని తెలిపింది. అందుకే త్రివిక్రమ్ ఎదురుగా వస్తున్నా పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నానని అంతగా తనకు కోపం వచ్చిందని హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో కాపుల ఉద్యమానికి తాను మద్దత్తు ఇవ్వడం వలన అవకాశాలు తగ్గుతున్నాయా అనే అంశంపై కూడా మాట్లాడింది.
ఏడుపు ముఖం పెట్టుకున్నావు ఏంటి
హేమ ఓ దర్శకుడి గురించి మాట్లాడుతూ సినిమా షూటింగ్ లో భాగంగా అనుభవాన్ని వివరించింది. తాను సాంగ్ కోసం అవుతుంటే.. అలా ఏడుపు ముఖం పెట్టుకున్నావు ఏంటి ప్రొడ్యూసర్ డబ్బులిస్తాడులే అని ఓ దర్శకుడు తనతో దురుసుగా ప్రవర్తించినట్లు హేమ తెలిపింది. మీటూ లాంటి సంఘటనలు ఏవీ తనకు ఇండస్ట్రీలోఎదురుకాలేదని.. తనతో అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం ఎవరూ చేయలేరని హేమ తెలిపింది.
మబ్బుల్లో సూర్యుడు
ఇక పూరి జగన్నాథ్ గురించి హేమ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారేలా ఉన్నాయి. పూరి జగన్నాథ్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని హేమ తెలిపింది. కానీ ఛార్మితో తనకు ఎలాంటి రిలేషన్ లేదని హేమ తెలిపింది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడు. ఆ మబ్బులు తొలగిపోతే మళ్ళీ అతడు వెలుగుతాడు. ఆ మబ్బులు ఎవరో మీరే అర్థం చేసుకోవాలని హేమ పరోక్ష వ్యాఖ్యలు చేసింది.