Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డ్రగ్స్ కేసు: దర్శకుడు పూరీ కూతురు వార్నింగ్!
డ్రగ్స్ కేసులో తన తండ్రి పేరు లాగడంపై పవిత్ర పూరి మండి పడ్డారు. తన తండ్రికి డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
హైదరాబాద్: టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సృష్టించిన ప్రకంపనలు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న వారితో పాటు ఎలాంటి సంబంధం లేని వారి పేర్లు కూడా బయటకు వస్తుండటం, మీడియాలో ఈ విషయమై బాగా ప్రచారం జరుగుతుండటంతో ఆయా స్టార్ల కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.
టాప్ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. పూరి డ్రగ్స్ తీసుకున్నారని, ఆయనకు నోటీసులు అందాయని, ఆయన ద్వారా ఇంకొందరు స్టార్స్ కూడా డ్రగ్స్ అలవాటయిందంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పూరి కూతురు పవిత్ర స్పందించారు.
నా తండ్రి అలాంటివాడు కాదు
డ్రగ్స్ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు అలాంటి అలవాట్లు లేదని పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర అన్నారు. మీడియాలో తన తండ్రి గురించి వస్తున్న వార్తలు విని షాకైనట్లు తెలిపారు.
తమ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం
తన తండ్రి సినీ ప్రముఖుడు కావడం వల్లనే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై అనవసరంగా నిందలు వేయవద్దని, ఇది తమ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని పవిత్ర తెలిపారు.
అదుపులో ఉండాలని వార్నింగ్
తన తండ్రి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు, ఉన్నత లక్ష్యాలతో కూడిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పనిపాట లేని వాళ్లే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని.... తన తండ్రి గురించి మాట్లాడేపుడు కాస్త అదుపులో ఉండాలని, ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని పవిత్ర వార్నింగ్ ఇచ్చారు.
|
పూరి స్పందన
డ్రగ్ కేసు వ్యవహారంలో మీడియాలో తన పేరు వస్తుండటంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై తాను ఇప్పటివరకు స్పందించలేదని, పైసా వసూల్ షూటింగులో బిజీగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.