Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిన్న కూతురు శ్రీజ కోసం: చిరంజీవి లండన్లో అందుకే.. (ఫోటో)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘ఆటో జానీ' చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ వెళ్లడంతో తన 150వ సినిమాకు సన్నద్ధం కావడానికే అని అంతా అనుకున్నారు. అక్కడ పిట్ నెస్ విషయంలో ప్రత్యేక శిక్షణ గురించి అని అపోహ పడ్డారు.
కానీ ఆయన లండన్ వెళ్లింది అందుకోసం కాదు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ లండన్లో చదువు కుంటోంది. ఇక్కడి కాన్వెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. శ్రీజ చదువుతున్న బ్యాచ్ కాన్వొకేషన్ కార్యక్రమం జరుగింది. ఇలాంటి కార్యక్రమాలకు విద్యార్థుల తల్లిదండ్రులు, సన్నిహితులు, స్నేహితులు హాజరవుతుంటారు. అందుకే చిరంజీవి, సురేఖ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చిరంజీవి
150వ
సినిమా
విషయానికొస్తే...
ఈ
చిత్రం
ఆగస్టులో
ప్రారంభం
కాబోతోంది.
ఇటీవల
చిరంజీవి
స్వయంగా
ఈ
విషయాన్ని
స్పష్టం
చేసారు.
150వ
సినిమా
పూరి
జగన్నాథ్
దర్శకత్వంలో
చేయబోతున్నట్లు,
ఆగస్టులో
సినిమా
ప్రారంభం
అవుతుందని
అభిమానులకు
క్లారిటీ
ఇచ్చారు.
తన
కుమారుడు
రామ్
చరణ్
తో
పాటు
బండ్ల
గణేష్
సినిమా
నిర్మాణంలో
పాలు
పంచుకుంటారని
తెలిపారు.
ఆగస్టులో
అంటే
చిరంజీవి
జన్మదినం
రోజు
ప్రారంభం
అవుతుందని
స్పష్టం
అవుతోంది.
150వ
సినిమాపై
స్వయంగా
చిరంజీవి
స్పందించడంతో
అభిమానులు
హ్యాపీగా
ఉన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు. సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.
సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.
కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.