Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హానెస్ట్ గా సినిమా చేసాను, అతనికి సినిమా విపరీతంగా నచ్చిది: పూరి జగన్నాధ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. మే 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ''నా ప్రాణం'' ఈరోజు విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా...
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ...
నేను ఇప్పటివరుకు చాలా కమర్సియల్ సినిమలు చేసాను. కొన్ని సినిమాల్లో కావాలనే సన్నివేశాలను జోడించి చెయ్యడం జరిగింది, కాని ఈ సినిమా హానెస్ట్ గా అటెంప్ట్ చెయ్యడం జరిగింది. ఆకాష్ చిన్నప్పటినుండి నటుడవుదామని అనుకొనేవాడు లక్కీగా నేను ఆకాష్ ను హీరోగా లాంచ్ చెయ్యడం జరిగింది. దిల్ రాజు ఈ సినిమా చూసి మెచ్చుకోవడం, ఈ సినిమాను తనే స్వయంగా రిలీజ్ చెయ్యడం ఆనందంగా ఉంది. సినిమా అందరిని అలరించబోతోందని నమ్ముతున్నాను. మీరు ఆకాష్, నేహ శెట్టిని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
ఆకాష్ మాట్లాడుతూ...
నాన్నా ఈ సినిమాను ఏ హీరోతోనైనా తియ్యవచ్చు, కాని నన్ను నమ్మి ఈ సినిమా నాతో చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. సినిమా మీ అందరికి నచ్చే విధంగా ఉండబోతోంది. నాన్నా ఈ సినిమాతో మరోసారి పెద్ద హిట్ సాధిస్తాడని నమ్మకంతో ఉన్నాను. మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను చూసి మా అందరిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు.
ఛార్మి మాట్లాడుతూ..
సినిమా మొదలైన దగ్గరినుండి అందరు ఫాషన్ తో వర్క్ చెయ్యడం జరిగింది, ఆకాష్, నేహ చలిని లెక్కచెయ్యకుండా మైనస్ డిగ్రి మంచులో నటించడం జరిగింది. సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా వచ్చింది. పూరి గారు కూల్ గా సినిమాలు చేస్తారు, ఈ సినిమా ఆయన స్టైల్ లో ఉండబోతోంది. సినిమా చూసిన కొద్దిమంది బాగుందని మెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు.
మరో భారి ఈవెంట్...
ఈ కార్యక్రమంలో నటుడు విషు రెడ్డి, రచయిత భాస్కరబట్ల, హీరోయిన్ నేహ శెట్టి, తదితరులు పాల్గొనడం జరిగింది. సినిమా విజయం పట్ల అందరు తమ దీమాను వెక్తం చెయ్యడం జరిగింది. త్వరలో ఈ సినిమాకు సంభందించి భారి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.