మెగాస్టార్ చిరంజీవికి మరో చేదు అనుభవం!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఎన్నడూ లేని విధంగా తొలిసారి బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నడిపించారు. అయితే ఈ షోకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని, టీఆర్పీ రేటింగులు చాలా తక్కువ వచ్చాయనే ప్రచారం జరిగింది. కొంతమంది దీన్ని ప్లాప్ టీవీ షోగా అభివర్ణించారు. బుల్లితెరపై తొలి అడుగులోనే మెగాస్టార్ స్థాయి వ్యక్తి ఇలాంటి అనుభవం చేదు అనుభవమే.
తాజాగా బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవికి మరోసారి చేదు అనుభవం ఎదురైందని టాక్. మెగాస్టార్ నటించిన 150వ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత అతిపెద్ద హిట్ గా చరిత్రకెక్కింది. బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ సాధించిన చిత్రం కూడా ఇదే. వెండి తెరపై భారీ హిట్ సాధించిన ఈ చిత్రం బుల్లితెరపై ప్లాప్ అయిందని టాక్.

చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్స్
ఇటీవల ఖైదీ నెం 150 చిత్రాన్ని బుల్లితెర ప్రీమియర్ షో వేయగా చాలా తక్కువ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బుల్లితెర విషయంలో మెగాస్టార్ కు మరో చేదు అనుభవం అంటూ ప్రచారం జరుగుతోంది.

ప్లాప్ సినిమా కంటే తక్కువ
మహేష్ బాబు నటించిన అట్టర్ ఫ్లాప్ సినిమా 'బ్రహ్మోత్సవం' సైతం 7.52 రేటింగ్ ను సాధించింది. చిరు సినిమాకు కేవలం 6.9 రేటింగ్ మాత్రమే వచ్చింది.

ఎందుకు తగ్గిందంటే?
అయితే ‘ఖైదీ నెం 150' సినిమా ప్రసారం అయిన సమయంలో మరో ఛానల్ లో అదే సమయానికి ఓ సినీ వేడుక ప్రసారం కావడంతో ఈ సినిమాకు రేటింగ్ తగ్గిందని కొందరు చెబుతున్నారు.

మెగాస్టార్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు-4' క్లోజ్ అయింది!... నెక్ట్స్ ఎవరో తెలుసా?

చిరంజీవి, 80వ దశకం స్టార్స్ చైనా ట్రిప్... ఫుల్లుగా ఎంజాయ్ చేశారు (ఫోటోస్)

‘దాసరి' జ్ఞాపకాల్లో రామ్ చరణ్, వి మిస్ యూ సార్ అంటూ...
‘దాసరి' జ్ఞాపకాల్లో రామ్ చరణ్, వి మిస్ యూ సార్ అంటూ.... ఏం చేశాడో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఐశ్వరరాయ్ మెగాస్టార్ కోసమా.. చరణ్ కోసమా? ఉయ్యాలవాడలో మరో సెన్సేషనల్ న్యూస్!

చిరు, పవన్ అండ.... బాహుబలి తాతను తీస్తానంటూ గొప్పలు?



Click it and Unblock the Notifications











