Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తండ్రి, కొడుకులతో పూరిజగన్నాథ్ సినిమా.. ఆ రెండు సినిమాలు అదిరిపోయాయి, కానీ!
Recommended Video
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిభ గల దర్శకుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీని కుదిపేసిన పూరి ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయాడు. బద్రి, ఇడియట్, పోకిరి, చిరుత, టెంపర్ వంటి హిట్స్ ఈ దర్శకుడు ఖాతాలో ఉన్నాయి. కానీ ఇటీవల పూరి తెరకెక్కిస్తున్న చిత్రాలు ఆడియన్స్ కు కనెక్ట్ కావడం లేదు. పూరి తన కుమారుడు ఆకాష్ పూరితో తెరకెక్కించిన మెహబూబా చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. పూరిజగన్నాథ్ తదుపరి చిత్రాల గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి.
తండ్రి కొడుకులతో
తాజగా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య తో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే పూరి ఈ ప్రతిపాదనని నాగ్ ముందు పూరి ఉంచాడట.
బిజీగా ఇద్దరూ
నాగార్జున ఈ చిత్రానికి సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ నాగార్జున, నాగ చైతన్యకు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాకే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున త్వరలో బంగార్రాజు చిత్రంతో బిజీ కాబోతున్నాడు. నాగచైతన్య పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. పూరి చిత్రం ప్రారంభం అయ్యేది ఏడాది చివర్లోనే అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అదిరిపోయే హిట్స్
గతంలో నాగార్జునతో పూరి రెండు చిత్రాలు చేసాడు. ప్రేమకథగా వచ్చిన శివమణి, ఎంటర్టైనర్ గా వచ్చిన సూపర్ మంచి విజయాలు సాధించాయి. దీనితో పూరి, నాగ్ కాంబినేషన్ లో వచ్చే మూడో చిత్రంపై మంచి అంచనాలు ఉంటాయనడంలో సందేహం లేదు.
మార్పు అవసరం
గతంలోలాగా పూరి తన ఫామ్ ని కొనసాగించాలని అనుకుంటే మార్పు అవసరం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుస ప్లాపుల నుంచి తేరుకోవాలంటే ముందుగా పూరి ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మంచి కథ సిద్ధం చేసుకోవాలి.