ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్ళాక మరో సంచలన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్!
కొద్ది సేపటి క్రితమే ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ తాజగా మరో సంచలన ట్వీట్ చేసారు. తన తల్లికి జరిగిన అవమానం కుట్రలో టీవీ9 రవిప్రకాష్, టివి శ్రీనిరాజా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేర్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తాజాగా మహా న్యూస్ ఛానల్ గురించి కూడా ఆయన ట్విట్టర్ లో ప్రస్తావించారు.
తన తలికి జరిగిన అవమానం అంశాన్ని మహా టివి కూడా అనేక డిబేట్లు నిర్వహించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మహా న్యూస్ ఛానల్ ఓనర్ ఎంపీ సుజనా చౌదరి అని పవన్ ప్రస్తావించారు. ఆ ఛానల్ సీఈవో మూర్తి కూడా జరగబోయే పరిణామాలని ఎదుర్కోవలసి ఉంటుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ తో మొదలైన ఈ పోరాటం రాజకీయ రంగు పులుముకుంది. పవన్ కళ్యాణ్ తల్లిని తానే తిట్టించానని వర్మ నిసిగ్గుగా ఒప్పుకున్నాడు. దీనితో మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులకు దీనివెనుక కుట్ర జరుగుతోందని, పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











