Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎప్పటికీ రుణ పడే ఉంటాను.. ప్రియమణి ఎమోషనల్ ట్వీట్
ఒక్కో హీరోయిన్కు కనీసం ఒక్కో ల్యాండ్ మార్క్ సినిమా ఉంటుంది. అలాంటి సినిమాల్లో హీరోయిన్ ప్రియమణికి గోలీమార్ ఒకటి. పవిత్ర క్యారెక్టర్లో ప్రియమణి జీవించేసింది. కమర్షియల్ సక్సెస్ను పక్కన బెడితే అన్ని కోణాల్లో ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చక్రి అందించిన పాటలు ఓ రేంజ్లో దుమ్ములేపాయి. మరీ ముఖ్యంగా మగాళ్లు వట్టి మాయగాళ్లే అన్న పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. నేటికి ఈ చిత్రం విడుదలై పదేళ్లు గడిచింది. ఈ సందర్భంగా ప్రియమణి సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
గోలీమార్ చిత్రానికి పదేళ్లు కావడంతో ఈ మేరకు సోషల్ మీడియాలో అంతా దాని గురించే చర్చ నడుస్తోంది. ఇక ప్రియమణి స్పందిస్తూ.. 'ఇలాంటి అద్భుతమైన చిత్రంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థన్యవాదాలు పూరి సర్. ఎన్నో అద్భుత క్షణాలున్నాయ్.. అవి ఎప్పటికీ మరిచిపోలేను. ఎప్పటికీ రుణం తీర్చుకోలేను. అద్భుతమైన సహ నటుడు గోపీచంద్కు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేసింది.
ప్రియమణి ట్వీట్కు స్పందించిన పూరీ జగన్నాద్.. మగాళ్లు వొట్టి మాయగాళ్లే.. అంటూ నవ్వుతున్న, దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేస్తూ మిస్ యూ అని ట్వీట్ చేశాడు. పూరీ చేసిన ఈ ట్వీట్కు చార్మీ స్పందిస్తూ.. భాస్కరభట్ల పాటల్లో నాకు నచ్చిన పాట ఇదే.. అంటూచెప్పుకొచ్చింది. దీనికి పాటల రచయిత భాస్కర భట్ల స్పందిస్తూ.. పూరి అన్నయ్యకు ధన్యవాదాలు.. అంటూ ఛార్మీ ఓ దండం పెట్టేశాడు. మొత్తానికి గోలీమార్కు దశాబ్దం నిండటం ఏమో గానీ వీరి ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.