Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెహబూబా : ఇంటిని అమ్మేసిన పూరి జగన్నాధ్, అందుకే ఇంత రిస్క్
లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ 'మెహబూబా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొంతకాలంగా హిట్స్ లేక వెనకబడిన ఆయన ఈ సారి బాక్సాఫీసు వద్ద వర్కౌట్ అయ్యే లవ్ స్టోరీతో పూర్తి నమ్మకంతో బరిలో దిగుతున్నారు. ఈ సినిమా ద్వారా తాను మళ్లీ దర్శకుడిగా స్టాండ్ అవ్వడంతో పాటు, తన కొడుకు ఆకాష్ను హిట్ సినిమాతో హీరోగా లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాణ బాధ్యతలు కూడా భుజానికెత్తుకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఈ సినిమా నిర్మించడం కోసం తన ఇంటిని కూడా అమ్మారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Recommended Video
ఇంటిని అమ్మిన విషయమై పూరి...
ఈ సినిమా కోసం ఇంటిని అమ్మారట, నిజమేనా? అనే ప్రశ్నకు పూరి స్పందించారు. ఈ సినిమా కోసం తనకు ఉన్న ప్రాపర్టీల్లో ఒక ఇంటిని అమ్మిన మాట నిజమే అని పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
వేరే బేనర్లో తీస్తే ఆకాష్ను ఎవరు చూస్తారు?
ఆకాష్ను హీరోగా పెట్టి వేరే బేనర్లో సినిమా తీస్తే ఎవరు చూస్తారు? అందుకే నేనే ఈ రిస్క్ తీసుకున్నాను. సినిమా నిర్మాణం కోసం నాకున్న ప్రాపర్టీలలో ఒక ఇంటిని అమ్మేశాను. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. అందకే వాడి మీద ఇంత డబ్బు వెచ్చించాను అని పూరి తెలిపారు.
ఎన్నోసార్లు డబ్బు పొగొట్టుకున్నాను
తన జీవితంలో ఎన్నో సార్లు వివిధ కారణాలతో డబ్బు పోగొట్టుకున్నాను. తిరిగి సంపాదించుకున్నాను. ప్రతిసారి నేను జీరో నుండి మొదలు పెట్టడానికి ప్రిపేర్ అయి ఉంటాను అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
మే 11న గ్రాండ్ రిలీజ్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. మే 11న సమ్మర్ స్పెషల్గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.
1971 ఇండియా-పాకిస్తాన్ వార్
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేయడంపై సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ, యాక్షన్: రియల్ సతీష్, ఆర్ట్: జానీ షేక్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్.