Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు.. అతడికి ప్రతి మహిళా కావాలి, డర్టీ పర్సన్.. నమ్మడమే చేసిన తప్పు!
Recommended Video
సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి నిరంతర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో మీడియా సంస్థల్లో పబ్లిసిటీ పొందినప్పటి నుంచి శ్రీరెడ్డి హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కొందరు స్టార్ హీరోలని కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తమిళ్ లీక్స్ అంటూ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే శ్రీరెడ్డి రాఘవ లారెన్స్, శ్రీకాంత్ వంటి తమిళ హీరోలపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజగా శ్రీరెడ్డి మరో హీరోపై బాంబు పేల్చింది.
ఆడపిల్లల ఉసురు
ఆడపిల్లల ఉసురు పోసుకున్నవారు చరిత్రలో బాగుపడలేదు అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్ గా తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ పెట్టింది. నా మీద నమ్మకం లేదా అంటూ మాయమాటలు చెప్పే వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని శ్రీరెడ్డి పేర్కొంది.
మీ స్టూడియోలు ఎంత
మహిళలతో పెట్టుకుని రాజ్యాలే పోగుట్టుకున్న వారు చరిత్రలో ఉన్నారు. ఇక మీ స్టూడియోలు ఎంత.. మీ బతుకులు ఎంత అంటూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీరెడ్డి పరోక్షంగా ఓ నిర్మాతని ఉద్దేశించి చేసింది.
నమ్మడమే
మాయ మాటలు చెప్పగానే పిచ్చితనంతో నమ్మేస్తాం. నమ్మడమే నేను చేసిన తప్పు అని శ్రీరెడ్డి పేర్కొంది. తనని చాలా మంది అవకాశాల పేరుతో నమ్మించి మోసం చేశారని శ్రీరెడ్డి తరచుగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే.
అతడు ఫ్రాడ్
తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ ని ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రపంచంలోకెల్లా అతడు మోసకారి అని ఆరోపించింది. సందీప్ కిషన్ తో చాలా ఇబ్బంది పడ్డా.
ప్రతి మహిళా
అతడు ప్రతి మహిళని కోరుకుంటాడు. అతడు మరెవరో కాదు సందీప్ కిషన్ అంటూ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. తనకు కనీసం బ్రతకాలని కూడా అనిపించడం లేదని ఎమోషనల్ అయింది.