సినిమా ఇండస్ట్రీ ఎదవల్లారా జరభద్రం.. శ్రీరెడ్డి వార్నింగ్, పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ!
మీడియాలో సంచనలంగా మారిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కూడా సంచలనాలు సృష్టిస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని శ్రీరెడ్డి సీరియస్ గా తీసుకున్న సంగతి తీసిందే. పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన దారుణమైన వ్యాఖ్యలతో శ్రీరెడ్డి పోరాటం నీరుగారిపోయిందనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ శ్రీరెడ్డి మాత్రం సోషల్ చిత్ర పరిశ్రమ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంది. ఓ కో ఆర్డినేటర్, జూనియర్ ఆర్టిస్టుని మోసం చేసిన వైనం, ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో జరిగిన రచ్చకు సంబందించిన వీడియో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మత్తు మందు ఇచ్చి
ఓ కోఆర్డినేటర్ మహిళా ఆర్టిస్టుకు డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి వాడుకున్నాడని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పేర్కొంది. బంగారం డబ్బులు ఎత్తుకుని పోయాడు. ప్రేమ, పెళ్లి అని చెప్పి మోసం చేశాడు అని శ్రీరెడ్డి పేర్కొంది.

అందుకే పెళ్లి చేశాం
ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన అతడికి నిజంగానే పెళ్లి చేసాం అని, అతడిపై మహిళలు విరుచుకుపడుతున్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ లో జరిగింది. కో ఆర్డినేటర్ పై మహిళా ఆర్టిస్టులు చెప్పులతో విరుచుకుపడుతున్న వీడియో అది. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ ఎదవల్లారా
ఇలా మహిళా ఆర్టిస్టులని మోసం చేసే ఎవ్వడైకినా చెప్పు దెబ్బలు తప్పవు.. సినిమా ఇండస్ట్రీ ఎదవల్లారా జరభద్రం అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీపై గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మీడియాకు దూరం
పవన్ కళ్యాణ్ తల్లిని శ్రీరెడ్డి దూషించడం పెను సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించడంతో కొన్ని మీడియా సంస్థలు పెద్ద కుదుపుకే లోనయ్యాయి. అప్పటి నుంచి సదరు మీడియా సంస్థలు శ్రీరెడ్డికి ప్రాధాన్యత కల్పించలేదు. దీనితో శ్రీరెడ్డి సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంది.


Click it and Unblock the Notifications











