twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌పై భీకర చేతబడి!?

    By Staff
    |

    Jr Ntr
    వారం రోజుల పాటు 8 మంది తంత్రులు ఈ పూజలో పాల్గొన్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ ప్రయాణిస్తున్న కారు కుక్క వల్ల ప్రమాదానికి గురయిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. తాంత్రికులు చేసిన కాలభైరవ (కుక్క) పూజల ప్రభావం ఏ మేరకు చూపిందో స్పష్టమవుతోంది. దీనికోసం సుమారు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కేరళలో కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి ద్వారా ఈ తాంత్రిక తతంగం నడిచినట్లు సమాచారం.

    వారు ఎన్టీఆర్ జాతక వివరాలు కూడా ప్రకటించారు..అందులో వ్రాసిన వివరాలు...జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. 20 మే 1983 రాత్రి 12.15 నిమిషాలకు జన్మించిన ఆయన మఖ నక్షత్రం, మూడవ పాదం, సింహరాశి, మకర లగ్నంలో జన్మించినట్లు జాతకం చెబుతోంది. అయితే, ఈ ఏలినాటి శని 5-9-2004 నుంచి 4-8-2012 వరకూ ఉంటుందని పండితుల అభిప్రాయం. లగ్నాథిపతి అయిన వాడు ఉచ్ఛస్థితిలో ఉండి, రాజ్యంలో ఉన్నందునే మృత్యుంజయుడయ్యారు. సూర్యుడిలో శని అంతర్దశ నడుస్తోంది. దీనివల్లే శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

    ఇక ఈ క్షుద్రపూజకి విరుగుడు ఏమిటన్నది కూడా రాసారు..ఎన్టీఆర్‌పై జరిగిన క్షుద్ర ప్రయోగానికి విరుగుడు ఉందని పండితులు చెబుతున్నారు. రుద్రయామళ తంత్రంలో రుద్ర ప్రాయశ్చిత్తం ఒక్కటే దీనికి విరుగుడుగా పేర్కొంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా 15 నుంచి 20 రోజుల్లో ఎన్టీఆర్‌ నడిచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్టీఆర్‌పై జరిగిన తాంత్రిక పూజలను తెలుసుకున్న పండితులు ఆయన పేరిట 11 రోజులు రుద్రయాగాలు చేయించడం వల్ల, శని ప్రభావం తగ్గి జూనియర్‌ ఎన్టీఆర్‌ త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు.

    1 | 2

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X