ఫ్లాష్ బ్యాక్ : డైరెక్టర్స్లో ఎవ్వరికీ లేని సంపాదన.. నమ్మించి రూ. 100 కోట్లు ముంచేశారా!
డైరెక్టర్ పూరీ జగన్నాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. ఇక్కడి యువత అయితే ఆయన్ను రోల్ మోడల్గానూ చూస్తుంది. ఎందుకంటే ఆయన తీసే సినిమాలు, చూపించే సీన్స్, తెరకెక్కించే విధానం, ఆ యాటిట్యూడ్ అన్నీ యూత్ను టార్గెట్ చేసేలానే ఉంటాయి. అందుకే పూరికి యూత్లో ఎనలేని ఫాలోయింగ్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు పూరి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన డైలాగ్ను వాడని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదు.

మాస్ డైలాగ్స్కు ఫేమస్..
పూరి జగన్నాద్ మొదటి నుంచి డైలాగ్స్కు ఫేమస్సే. ఆయన చూపించే హీరోయిజం, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్లో తమ హీరోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. మొదటి చిత్రం బద్రి నుంచి నిన్న మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ వరకు తన పంథాను మాత్రం వీడలేదు. తన శైలిలోనే తెరకెక్కిస్తూ మాస్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

టాప్ డైరెక్టర్గా బిజీ..
పూరీ జగన్నాద్కు వరుస హిట్స్ రావడం, పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆయన లెవెల్ ఎక్కడికో వెళ్లింది. ఆ కథను ఎవ్వరూ నమ్మక పోయినా సొంతంగా డబ్బులు పెట్టి మరీ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. పూరికి అసలు ఎదురన్నదే లేకుండా పోయింది. మధ్యలో ఫ్లాపులు వచ్చిన పూరీ చరిష్మా మాత్రం తగ్గలేదు.

ఆర్థిక వ్యవహారాలు కూడా..
తనకు ఎంత వస్తుంది? ఎంత ఉంది? ఎంత వెళ్తోంది.. అనే విషయాలను ఎప్పుడు పట్టించుకునే వాడే కాదంటా. ఆర్థిక వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకునేవాడంటా. అయితే అవన్నీ పట్టించుకోని పూరినీ నిండా ముంచేశారట. దాదాపు వంద కోట్ల వరకు నొక్కేశారని తెలుస్తోంది.
Recommended Video

తెలుగు డైరెక్టర్స్లో ఎవ్వరికీ లేని సంపాదన..
ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాద్ మాట్లాడుతూ.. తెలుగు దర్శకుల్లో ఎవ్వరూ సంపాదించలేనంతగా సంపాదించా, ఆ రేంజ్లో తన రెమ్యూనరేషన్ ఉండేదని కాని ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే ఛార్మీ తోడుగా ఉండటం, ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలు ఆమే చూస్తుండటం, ఇస్మార్ట్ రూపంలో భారీ హిట్ రావడంతో మళ్లీ పూరికి పూర్వ వైభవం వచ్చింది.


Click it and Unblock the Notifications











