Gunde Ninda Gudi Gantalu Weekly: కల్పన ఎంట్రీ, 40 లక్షల మిస్టరీకి తెర, మనోజ్-రోహిణి గుట్టురట్టు
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 4వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకూ 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్లో వినోదం, ఉద్రిక్తత, భావోద్వేగం అన్నీ కలిసిపోయాయి. ఇంట్లోకి వచ్చిన న్యూమరాలజిస్ట్ "రోమతి" అనే పేరుకు ₹20,000 ఛార్జ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మనోజ్ భయంతో డబ్బులు ఇవ్వడం సన్నివేశాన్ని హాస్యాస్పదంగా మార్చింది. వెంటనే వచ్చిన గోస్ట్ హంటర్ దెయ్యాల కథతో మరింత గందరగోళం సృష్టించగా, బాలు తన స్టైల్లో ఆమెను బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించడం నవ్వులు పంచింది. కానీ మనోజ్ మళ్లీ డబ్బులు ఇవ్వడం అతని అమాయకత్వాన్ని చూపించింది. ఇక ప్రభావతి ఆకలి విషయాన్ని "ఎలుకలు పరిగెడుతున్నాయి" అని చెప్పడం, దానికి బాలు ఇచ్చిన రిప్లై కామెడీ హైలైట్గా నిలిచింది.

Photo courtesy: Jio Hotstar
అదే సమయంలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి, పెద్ద మొత్తంలో లోన్ రాదని చెప్పడంతో కథ సీరియస్ మలుపు తీసుకుంది. డబ్బుల కోసం మనోజ్ ఇంటిని అమ్మాలని చెప్పడం కుటుంబంలో పెద్ద కలహానికి దారితీసింది. బాలు తీవ్రంగా వ్యతిరేకించగా, రవి భావోద్వేగంతో స్పందించాడు. చివరికి ప్రభావతి "ఈ ఇల్లు నా తండ్రి జ్ఞాపకం, అమ్మను" అంటూ గట్టి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మనోజ్ ప్లాన్ దెబ్బతింది. అయితే రోహిణి మాత్రం వెనక్కి తగ్గకుండా అబద్ధాలతో డబ్బులు తెచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఫోన్ డ్రామాపై మీనా అనుమానం వ్యక్తం చేయడంతో కొత్త సస్పెన్స్ మొదలైంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ కుటుంబ విలువలు, మూఢనమ్మకాలు, మోసం మధ్య జరిగే సంఘర్షణలను ఆసక్తికరంగా చూపించింది.
మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠభరిత మలుపులతో సాగింది. ప్రారంభంలో మీనా-బాలు సంభాషణ కథకు కీలకంగా మారింది. రోహిణి ఫోన్ కాల్ వ్యవహారంపై మీనా అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమె తానే ప్రశ్నలు అడిగి తానే సమాధానాలు చెప్పిందని గుర్తు చేస్తుంది. దీనిపై బాలు కూడా సీరియస్గా స్పందించి, త్వరలో నిజం బయటపడుతుందని చెబుతాడు. ఇక రవి-శృతి ట్రాక్లో మనోజ్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. శృతి ముందుగానే అలర్ట్ చేసినట్లే మనోజ్ వచ్చి డబ్బులు అడగగా, రవి తన పరిమితులు చెప్పి తిరస్కరిస్తాడు. కానీ మనోజ్ శృతి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డబ్బులు తెప్పించమని ఒత్తిడి చేయడంతో ఉద్రిక్తత పెరుగుతుంది. దీనిపై శృతి ఘాటుగా స్పందించి, ఆస్తి విషయాలు తమ కుటుంబానికి చెందినవని స్పష్టం చేస్తుంది. రవి కూడా బాలు చేసిన సహాయాలను గుర్తుచేసి మనోజ్కు కౌంటర్ ఇస్తాడు.
ఆ తర్వాత కోపంతో బయటకు వెళ్లిన మనోజ్, రోహిణితో కలిసి కొత్త ప్లాన్ వేస్తాడు. "ముంబై ముఖేష్ను ఇంప్రెస్ చేసి బిజినెస్ పెంచుకుందాం" అని నిర్ణయిస్తాడు. ఇదే సమయంలో బాలు-మీనా మధ్య కుటుంబ విలువలపై హృద్యమైన సంభాషణ సాగుతుంది. ఎపిసోడ్ హైలెట్గా ప్రభావతి-రోహిణి సన్నివేశం నిలుస్తుంది. రోహిణి అబద్ధాలను బయటపెడుతూ తీవ్రంగా నిలదీయడం, చివరకు ఆమె నిజం చెప్పే సన్నివేశం ఉత్కంఠ రేపుతుంది. అయితే అది కల అని తేలడంతో ట్విస్ట్ మరింత ఆసక్తిని పెంచింది. మరోవైపు బాలు ఎయిర్పోర్ట్ నుంచి కస్టమర్ను తీసుకువస్తాడు. ఆమె గతంలో ₹45 లక్షలు మోసపోయిన విషయాన్ని చెప్పడం కథలో కొత్త మలుపుకు సంకేతమిచ్చింది. ఈ ఇల్లు-మనోజ్ డీల్కు సంబంధం ఉందా అన్న ఆసక్తితో ఎపిసోడ్ ముగిసింది.
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రారంభంలో ప్రభావతి-సత్యం మధ్య జరిగిన సంభాషణ భావోద్వేగంగా సాగింది. కొత్త ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన ఇళ్లను చూసిన ప్రభావతి, "మనమూ ఇలా రిచ్గా ఉండాలి" అంటూ పెద్ద ఆశలు వ్యక్తం చేయగా, సత్యం మాత్రం పాత ఇంటి జ్ఞాపకాలు, కుటుంబ విలువలను గుర్తుచేస్తూ ఆమెను హెచ్చరించాడు. అయినా ప్రభావతి తన కొడుకు మనోజ్ వల్ల తమ జీవితం మారిపోతుందని నమ్మకంగా చెప్పడం కథలో అత్యాశను ప్రతిబింబించింది. మరోవైపు బాలు, కల్పనను రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకెళ్లగా అక్కడే మనోజ్-రోహిణి కనిపించడం కథలో ట్విస్ట్ తీసుకొచ్చింది. మనోజ్ తన అహంకారంతో కొత్త బిల్డింగ్ కొనుగోలు చేశామని గొప్పలు చెప్పగా, బాలు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు.
ఇదే సమయంలో మనోజ్ వాయిస్ విన్న కల్పన ఒక్కసారిగా టెన్షన్కు గురై అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఆమెకు మనోజ్తో గతంలో ఏదో సంబంధం ఉందన్న అనుమానాలను పెంచింది. ఇక అసలు హైలైట్ విల్లా మోసం బయటపడటమే. "రోమతి" పేరుతో నేమ్ బోర్డ్ పెట్టించేందుకు సిద్ధమైన మనోజ్ కుటుంబానికి అసలు యజమాని ఎంట్రీతో షాక్ తగిలింది. తాము 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కొనుగోలు చేశామని చెప్పినా, ఆ ఇంటిని అమ్మిన వ్యక్తి కేవలం అద్దెదారుడే అని బయటపడింది. పోలీసులు వచ్చి మనోజ్ను తీవ్రంగా మందలించగా, కుటుంబం అవమానంతో పాత ఇంటికి తిరిగి వచ్చింది. చివర్లో సత్యం "అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాం" అంటూ బాధపడటం ఎపిసోడ్కు ఎమోషనల్ ముగింపుగా నిలిచింది.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగింది. మనోజ్ విల్లా పేరుతో 30 లక్షలు మోసపోవడం కుటుంబాన్ని షాక్కు గురిచేసింది. సత్యం తన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మనోజ్పై మండిపడ్డాడు. అయితే ప్రభావతి మాత్రం మనోజ్కు అండగా నిలిచి, మోసపోయిన వాడిని ఓదార్చాలే తప్ప అవమానించకూడదని సత్యంతో వాదించింది. బాలు మాత్రం ఈసారి అస్సలు తగ్గకుండా మనోజ్ను నిలదీశాడు. గతంలో 40 లక్షలు, ఇప్పుడు 30 లక్షలు పోగొట్టుకోవడంపై తీవ్రంగా ప్రశ్నించాడు. ఈ క్రమంలో రోహిణి తండ్రి జైలులో ఉన్నాడని చెప్పడంతో బాలుకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
ఇక మోసగాళ్లను పట్టుకోవాలని నిర్ణయించిన బాలు, మణికంఠతో కలిసి విచారణ ప్రారంభించాడు. విల్లా దగ్గర విచారణలో ఓ సీరియల్ నటి తరచూ అక్కడికి వచ్చేదని తెలిసి కథలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇదే సమయంలో మీనా, సుమతి సహాయంతో బాలు ఫోన్లో కనిపించిన ఫోటో ద్వారా కల్పన అనే అమ్మాయి ఈ మోసం వెనుక ఉందని గుర్తించాడు. కోపంతో కల్పనను నిలదీసిన బాలు, అక్కడ అసలు నిజం తెలుసుకుని షాక్ అయ్యాడు. కల్పన ఇప్పటికే 45 లక్షలు మనోజ్, రోహిణిలకు తిరిగి ఇచ్చేశానని, పోలీస్ స్టేషన్లో బాలు సాక్షిగా సంతకం కూడా పెట్టాడని చెప్పింది. దీంతో అసలు మోసం మనోజ్-రోహిణిలదేనని తేలింది. వెంటనే బాలు ఇంట్లోనే ఫ్యామిలీ కోర్ట్ ఏర్పాటు చేసి, కల్పనను సాక్ష్యాలతో రప్పిస్తానని ప్రకటించడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.
PEDDI: నార్త్ అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. రిలీజ్కు ముందే ఆల్ టైమ్ రికార్డ్..
శుక్రవారం ప్రసారమైన గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ ఘర్షణలు, షాకింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతకాలంగా ఇంట్లో అందరికీ అనుమానంగా ఉన్న 40 లక్షల వ్యవహారం చివరకు బయటపడటంతో కథ కీలక మలుపు తిరిగింది. బాలు నేరుగా మనోజ్ను ప్రశ్నించగా అతడు తడబడిపోయాడు. రోహిణి సాక్ష్యాలు అడగగా, బాలు "సాక్ష్యం చెప్పేవాళ్లు కూడా వస్తారు" అంటూ మనోజ్ మాజీ ప్రేయసి కల్పనను ఇంట్లోకి తీసుకురావడం ఎపిసోడ్కు హైలైట్గా నిలిచింది.కల్పన ఎంట్రీతో ఇంట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె సత్యం, ప్రభావతిలకు క్షమాపణలు చెప్పినా.. అసలు షాక్ అప్పుడే మొదలైంది.
"నేను తీసుకెళ్లిన 40 లక్షలు ఎప్పుడో తిరిగి ఇచ్చేశాను.. అదికూడా 45 లక్షలు" అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ డబ్బులు మనోజ్, రోహిణికే ఇచ్చానని, వడ్డీ పేరుతో మరో 5 లక్షలు కూడా తీసుకున్నారని వెల్లడించింది. పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించడంతో మనోజ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఇక రవి, శృతి, మీనా ఒక్కొక్కరు మనోజ్, రోహిణిలను నిలదీయడం ఎమోషనల్గా మారింది. సత్యం "నువ్వు నా కొడుకనే చెప్పుకోవడానికి అసహ్యం వేస్తోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేయడం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. చివరకు మనోజ్ నిజం ఒప్పుకుంటూ "ఇదంతా రోహిణి ప్లాన్" అని చెప్పడంతో అందరి చూపులు రోహిణిపై పడ్డాయి. ప్రభావతి కూడా తీవ్ర ఆగ్రహంతో రోహిణిపై విరుచుకుపడింది. ఎపిసోడ్ చివర్లో మనోజ్, రోహిణిల మధ్య గొడవ మరింత పెరగడంతో కథ మరో ఆసక్తికర మలుపు తిరిగింది.


Click it and Unblock the Notifications







