Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హిట్టిచ్చిన హీరోతో మరోసారి మాస్ సినిమాను ప్లాన్ చేస్తున్న పూరి
పూరి జగన్నాథ్ మేకింగ్ అంటే ఎంత డిఫరెంట్ గా ఉంటుందో మన హీరోలకు బాగా తెలుసు. ఒకప్పుడు ఆయనతో సినిమా అంటే చాలు స్టార్ హీరోలు ఎంతో ఇష్టంగా వర్క్ చేసేవారు. కానీ ఒకానొక సమయంలో పూరి కూడా డిజాస్టర్స్ బాట పట్టడంతో ఒకప్పుడు ఆయన వల్ల సక్సెస్ పొందిన వాళ్ళు కూడా దూరం పెట్టారు. దీంతో పోకిరి దర్శకుడు చాలా హార్ట్ అయ్యాడు.
ఎంత మంది హీరోల చుట్టూ తిరిగినా కూడా వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా రామ్ పోతినేని వంటి క్లాస్ హీరోతో ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ సినిమాను తెరకెక్కించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఎవరు తనను నమ్మలేని సమయంలో రామ్ తనను నమ్మాడు అని పూరి జగన్నాథ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే మరోసారి అదే హీరోతో మరో సినిమా చేయాలని పూరి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ బాగానే వస్తున్నాయి. కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ప్రస్తుతం రామ్ కోసం కూడా పూరి ఒక మాస్ కథను రెడీ చేస్తున్నాడట. ఇక రామ్ నెక్స్ట్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే.