Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. రవితేజ, మహేష్ బాబుకు జరిగిందే రామ్తో రిపీట్ కానుందా..?
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గత సినిమాల తాలూకు రికార్డుల పరంగా రాబోయే సినిమా ఎలా ఉండబోతుందని అంచనాలు వేస్తుంటారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో తాజాగా పూరి జగన్నాథ్ రిజెక్షన్ సెంటిమెంట్ పై చర్చలు జరుగుతున్నాయి. గతంలో పూరి జగన్నాథ్ వినిపించిన కథలు కొందరు స్టార్స్ రిజెక్ట్ చేయగా.. అవే కథలు వేరే స్టార్ తో తెరకెక్కిస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఈ లిస్టులో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి, రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇడియట్ సినిమా కథను పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేయగా.. అది చివరకు రవితేజ హీరోగా రూపొంది ఆయన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయింది. అదేవిధంగా పోకిరి స్టోరీని రవితేజ కోసం సిద్ధం చేస్తే అది కాస్త మహేష్ హీరోగా తెరకెక్కి భారీ సక్సెస్ సాధించింది. దీంతో ఇదే సెంటిమెంట్ని పూరి జగన్నాథ్ తాజా సినిమా ఇస్మార్ట్ శంకర్పై అప్లై చేస్తున్నారు.
నిజానికి ఇస్మార్ట్ శంకర్ కథను హీరో విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట పూరి జగన్నాథ్. కానీ విజయ్ దేవరకొండ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా ఆయన ప్లేస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ డాషింగ్ డైరెక్టర్. ఈ మేరకు రామ్ ని సరికొత్తగా మేకోవర్ చేసి ప్రెసెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా హీరో రామ్ లుక్ బాగా అట్రాక్ట్ చేసింది. దీంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ ని మలుపుతిప్పే సినిమా కావడం ఖాయం అంటున్నారు. పైగా దీనికి రిజెక్షన్ సెంటిమెంట్ కూడా అప్లై చేసి ఊహిస్తున్నారు. గతంలో రవితేజ, మహేష్ బాబులకు జరిగిందే రామ్ విషయంలోనూ రిపీట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ జులై 18వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.