Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చాలా వెరైటీగా ఉంది.. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’పై పూరి జగన్నాథ్ కామెంట్స్
ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో టాప్ సెలెబ్రిటీలను భాగస్వామ్యులను చేయాల్సి ఉంటుంది. అలా ఎంత మంది స్టార్స్ సినిమా కోసం ముందుకు వస్తే అంతలా జనాల్లోకి వెళ్తుంది. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజేష్ నాయుడు నిర్మాతగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'.
ఇప్పటికే ఈ మూవీ కోసం నాగబాబు, వైఎష్ షర్మిల, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారంతా కదిలి వచ్చారు. ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేశాడు. మార్చి 19న రాబోతోన్న ఈ మూవీపై ఇప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. తాజాగా పూరి జగన్నాథ్ రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం పూరి మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.
'ఈ కథలో పాత్రలు కల్పితం' .. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి..సినిమా కూడా చాలా బాగుంటుంది. వెరైటీ స్టోరీ తో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోందంటూ పూరి జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. సినిమా బాగా ఆడాలని కోరుకునే అందరికి కృతజ్ఞతలు తెలిపాడు.