మానవత్వం ఇంకా ఉందనే నమ్మకం.. పూరి జగన్నాథ్ పోస్ట్ వైరల్
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏవిధంగా కుదిపేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరుగుడు లేని ఈ వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యమే అతలాకుతలమైంది. మనదేశంలోనూ కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. కరోనా కట్టడికి మన ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంటున్నాయి.
కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజుల లాక్ డౌన్ను విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు ఎవ్వరూ గడప దాటి బయటకు రాకూడదు. అందరూ
ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాలు కోరాయి .అయితే కరోనా మాత్రం అదుపులోకి రాకపోవడంతో మరి కొన్ని రోజులు లాక్ డౌన్ను పొడిగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదంతా కాసేపు పక్కనబెడితే.. లాక్ డౌన్లో మూగ జీవాల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అందరికీ తెలిసిందే.

మూగజీవాలకు తిండి లేక అల్లాడిపోతున్నాయి. తాజాగా పూరి జగన్నాథ్ షేర్ చేసిన ఓ పోస్ట్ అందర్నీ కదిలిస్తోంది. స్పెయిన్లో ఓ దృశ్యం అది. తన పైన ఉండే ఇంటి వాళ్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. అయితే ఆ ఇంట్లో వాళ్లు ప్రతి రోజు ఆ కుక్కకు ఏదో ఒకటి ఫీడ్ చేస్తారట. అందంతా తెలిసిన కిందిటి యువకుడు.. కుక్కకు ఆహారాన్ని అందించాడు. ఇలాంటివి చూసినప్పుడే మానవత్వం ఇంకా ఉందని నమ్మకం కలుగుతుందని అందులో ఉంది. హృదయాన్ని కదలించే పోస్ట్ చేయడంతో పూరిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











