Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరోసారి ‘ఇస్మార్ట్’ కాంబినేషన్: ఆ మూవీని రీమేక్ చేయబోతున్న రామ్ - పూరీ జగన్నాథ్
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. దాదాపుగా అదే పరిస్థితిని ఎదుర్కొంటోన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హిట్ టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసిందీ చిత్రం. మొత్తంగా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పూరీతో అతడు మరోసారి జత కట్టబోతున్నాడని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కలయికలో మరో సినిమా రాబోతుందట. బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని ఈ జోడీ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, అది ఇప్పుడు కాదని అంటున్నారు. 2022 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, దీన్ని బాలీవుడ్ నిర్మాతతో కలిసి పూరీ జగన్నాథ్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కాంబో మరోసారి హైలైట్ అవుతోంది.
ఇక, ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్, పూరీ, చార్మీలు కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. మరోవైపు, తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక.. కొత్త ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందట.