Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్-పూరి మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ విలన్ ఎవరంటే..?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టెనర్ 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. మేలో ఈ మూవీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. సుధాన్షు పాండే ఇటీవల విడుదలైన రజనీకాంత్ 2.0 మూవీలో ప్రొఫెసర్ బోరా కొడుకు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో సుధాన్షు పాండే భారీ గడ్డంతో డిఫరెంట్ లుక్తో కనిపిస్తారట. 'డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.
కాగా.. ఈ చిత్రానికి హీరోయిన్ ఖరారైంది. 'మిస్టర్ మజ్ను' ఫేం నిధి అగర్వాల్ను ఎంపిక చేసినట్లు నిర్మాత చార్మీ కౌర్ అఫీషియల్గా ప్రకటించారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను తర్వాత... నిధి అగర్వాల్ తెలుగులో చేస్తున్న మూడో సినిమా ఇది.
ఈ సినిమాలో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య, ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్, ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి, పాటల రచయిత: భాస్కరభట్ల, ఫైట్స్ : రియల్ సతీష్.