Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఆగడు' ఫలితం : శ్రీనువైట్ల రాత్రింబవళ్లూ అదే పనిలో
హైదరాబాద్ : హిట్, ఫ్లాఫ్ గేమ్ ల మీద సినీ పరిశ్రమ నడుస్తూంటుంది. హిట్ వస్తే ఆ డైరక్టర్ ని టీమ్ ని ఎత్తేయటం, అదే దర్శకుడు ఆ తర్వాత ఫ్లాఫు ఇస్తే అంతే వేగంగా క్రింద పడేయటం సర్వ సాధారణం. అంతేకాదు హిట్ లో ఉన్నప్పుడు ఉన్న కమిట్ మెంట్స్ సైతం ప్లాపులో కంటిన్యూ కావు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే...ఆగడు ఫ్లాపు తర్వాత శ్రీను వైట్ల, రామ్ చరణ్ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే రామ్ చరణ్ మాత్రం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని తెలుస్తోంది. తను గోవిందుడు అందరివాడేలా తర్వాత చేస్తాను అని ఇచ్చిన మాట మీదే నిలబడి ఉన్నాడట.
అయితే రీసెంట్ ఇంటర్వూలో శ్రీను వైట్ల... ఓ వారం టైమ్ ఇవ్వండి... నా తదుపరి చిత్రం వివరాలు ప్రకటిస్తాను అని అనడటంతో అందరిలోనూ రామ్ చరణ్ తో ప్రాజెక్టు లేదనే సందేహాలు వచ్చాయి. కానీ శ్రీను వైట్ల స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేస్తూ ఎలాగైనా ఆగడుని మరిచిపోయే హిట్ ఇవ్వాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త ఇంప్రెవైజేషన్స్ చేసుకుంటూ రామ్ చరణ్ ని కలుస్తున్నాడని తెలుస్తోంది. అయితే గతంలో కన్నా మరింత ఎక్కువగా శ్రీనువైట్ల కష్టపడుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ సైతం ఇన్నాళ్లూ యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా ఉన్న తనను తాను ఫ్యామిలీ హీరోగానూ టర్న్ తీసుకోవాలని నిర్ణయం తీసుకునే కృష్ణవంశీ, శ్రీను వైట్ల చిత్రాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనలో కామెడీ టైమింగ్ సైతం ఉందని ప్రూవ్ చేసుకోవాలే తపనతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని శ్రీను వైట్ల తో చేయాలని పిక్స్ అయినట్లు తెలుస్తోంది.