అనుపమ పరమేశ్వరన్
Born on 20 Feb 1996 (Age 27)
అనుపమ పరమేశ్వరన్ బయోగ్రఫీ
అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది. అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్లోని మేరీ జార్జ్, తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అనుపమ సినిమాలలో రాకముందు మలయాళంలో టీవిషోలు, సెలబ్రెటీ ఛాట్ షోలు, రియాల్టిషోలు చేసింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించింది. తరువాత ఈమెకు మలయాళ చిత్రం జేమ్స్ & అలైస్ లో అవకాశం చిక్కింది. తరువాత ఆమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు తన్నుకు వచ్చాయి. మాతృభాష మలయాళమైనా తొలి తెలుగు సినిమా అ ఆలో స్వంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
తరువాత ఈమె మలయాళం నుండి తెలుగులోనికి పునర్మించబడిన ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. ధనుష్ హీరోగా వెలువడిన తమిళ సినిమా "కోడి"లో నటించింది. ఇది ఆమెకు తొలి తమిళ సినిమా. ఈమె 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్తో జంటగా నటించింది.
ఈమె ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో "అందమైన జీవితం" అనే పేరుతో డబ్ చేయబడింది. 2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్ పోతినేని సరసన నటించింది. ఇంకా ఈమె నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది.
సంబంధిత వార్తలు