ఊసరవెల్లి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, తమన్నా, ప్రకాశ్రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ప్లే, దర్శకత్వం: సురేందర్రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత బి వి వి ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
డబ్బుకోసం ఎలాంటి పనైనా చేసే టోని(ఎన్టీఆర్)ముంబై నుంచి హైదరాబాద్ కి నీహారక(తమన్నా) కోసం వస్తాడు. రాత్రిబవళ్లూ తేడాలేకుండా ఆమె వెనకే తిరుగుతూ ప్రేమించమని తిరుగుతూంటాడు. అయితే అతను ఆమె మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకుంటాడు. అతన్ని నుంచి ఆమెను దూరం చేసేందుకు కొందరని హత్యలు చేస్తూంటాడు. అయితే ఆమెకోసం అతను హత్యలు చేయటం లేదని అతనికి వేరే లక్ష్యం ఉందని తెలుస్తుంది. ఇంతకు ఎవరా టోని, నీహారికను ఎందుకలా వెంబడిస్తున్నాడు..ఊసరవిల్లిగా ఎందుకు మారి ఎందుకు హత్యలు చేస్తున్నాడు..అనేది మిగతా కథ.