సరైనోడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా, ఆది, శ్రీకాంత్, ప్రదీప్ రావత్, అంజలి, జయప్రకాష్ వి, వినయ ప్రసాద్, విద్యుల్లేఖ రామన్, ప్రభాకర్ రెడ్డి, కిట్టి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తామన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.
కథ
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా బయిటే ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన...హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటూ, అందిరి హీరోల్లాగా అన్యాయాలను అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. ఇదిలా ఉంటే..గన ఓ రోజు తనుండే ఏరియా ఎమ్మల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా)ని చూసి.. తో ప్రేమలో పడతాడు. ఆమె వెనక పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మల్యే ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను చంపటానికి వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) అనే విలన్ మనుష్యులు వెంటబడుతూంటారు. అప్పుడు గన ఏం చేసాడు... ఆమెను కాపాడాడా... వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా.. మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.