ట్రెండింగ్ : పాత్ర డిమాండ్ చేస్తే చివరకు అది కూడా చేస్తా.. ఆ వయసులో పుట్టే కోరికలు చాలా ఇష్టం
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
Recommended Video

పాత్ర డిమాండ్ చేస్తే చివరకు అది కూడా చేస్తా.. దేవుడ్ని ఆ వరం అడుగుతానన్న పాయల్
ప్రయాణం చిత్రంతో సినీ కెరీర్ను మొదలు పెట్టింది పాయల్ ఘోష్. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాయల్ ఘోష్కు అవకాశాలు కూడా వచ్చాయి. మళ్లీ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెళ్లి సినిమాలో ఓ కీలక పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య పాయల్ మాత్రం వార్తల్లో తెగ నిలుస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ మీరా చోప్రా వివాదం, సుశాంత్ మృతి, డిప్రెషన్లపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఆ విశేషాలేంటో ఓ సారిచూద్దాం.

ఎన్ని కోట్లు కుమ్మరించినా షూటింగ్లకు రాలేము.. రాజమౌళికి షాకిచ్చిన RRRహీరోలు
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా 400కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అన్ని సినిమా ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇలాంటి సినిమా ప్రస్తుతం ఆగిపోవడానికి కారణం హీరోలే అని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా కూడా షూటింగ్ కి రాలేమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారట.

ఆ వయసులో పుట్టే కోరికలు చాలా ఇష్టం.. కాబోయే వాడు ఇలా ఉండాలి: పునర్నవి
బిగ్ బాస్ షో ద్వారా సరికొత్తగా దర్శనమిచ్చిన పునర్నవి భూపాలం ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కి ఉహీంచని షాక్ లు ఇస్తోంది. అందంతోనే కాకుండా ఆమె మాటలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అమ్మడు పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. అలాగే ప్రేమ గురించి భవిష్యత్తు ప్రాణాళికల గురించి క్లుప్తంగా వివరించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భార్యను వదిలేసి హీరోయిన్తో ‘మ్యాడ్ మెన్' రొమాన్స్.. వైరస్ విజృంభించినా..
హాలీవుడ్ చిత్రం మ్యాడ్ మెన్ యాక్టర్ జాన్ హమ్ డేటింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికిన ఆయన తాజాగా తోటి హీరోయిన్ అననా అస్కియోలాతో అఫైర్ కొనసాగిస్తూ ఉండటంతో మీడియాలో హైలెట్గా మారింది. ఓ వైపు ప్రాణాంతక కరోనావైరస్ వ్యాధి విజృంభిస్తున్నా లెక్కచేయకుండా రొమాంటిక్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ వీరిద్దరి మీడియా కంటపడటం మరింత హాలీవుడ్లో హాట్ టాపిక్గా తీసింది. వివరాల్లోకి వెళితే..

ఆఫర్ అడిగితే కోరిక తీర్చమనే వారు.. నా బతుకు సుశాంత్లానే.. దొంగ దొంగ హీరోయిన్ బాంబు
బాలీవుడ్లో ఇండస్ట్రీ కుటుంబాలకు చెందని అవుట్ సైడర్స్కు నానా రకాల వేధింపులు ఉంటాయనే విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు బయటపెడుతున్నారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఇలాంటి విషయాలు మీడియాలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. తాజాగా 90వ దశకంలో యువతను ఉర్రూతలూగించిన అను అగర్వాల్ గతంలో జరిగిన విషయాలను తాజాగా నోరు విప్పి ఓ బాంబు పేల్చినంత పనిచేశారు. అను అగర్వాల్ గురించి, ఆమె చెప్పిన విషయాల గురించి..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సుశాంత్ది హత్యే.. సీబీఐ విచారణకు డిమాండ్.. ప్రముఖ నటుడి ఉద్యమం
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పలువురు ఇప్పటికే ఆయనది ఆత్మహత్య కాదు. హత్యే అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నడం హిందీ చిత్ర పరిశ్రమలో వివాదంగా మారింది. కొందరు అభిమానులు ర్యాలీలు చేపడుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా సుశాంత్కు న్యాయం జరగాలి అంటూ డిమాండ్లు మీడియాలో కనిపిస్తున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోసారి బిల్డప్ ఇచ్చి బుక్కైన కౌశల్.. బిగ్బాస్లో వచ్చిన ఫోన్ పగలగొట్టి..
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ మండా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను బిగ్ బాస్ ద్వారా ఎంత స్పీడ్ గా క్రేజ్ అందుకున్నాడో అంతే స్పీడ్ గా డౌన్ అయ్యాడు. రియాలిటీ షో ఉన్నన్ని రోజులు ఒక విధంగా మనోడు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం అతని ఓవరాక్షన్ కారణంగా ఉన్న ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసుకున్నాడు అనే విధంగా ట్రోల్స్ వచ్చయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్నేహితురాలికి కరోనా పాజిటివ్.. మూడు రోజుల క్రితం ముద్దుపెట్టిన సమంత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు సినీ తారలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఊహించని విధంగా ఎక్కడో ఒక చోట కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య షాక్ కి గురి చేస్తోంది. ఇక ఇటీవల సమంత తన స్నేహితురాలితో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో ఆడియెన్స్ ని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే రీసెంట్ గా ఆ యువతికి కరోనా టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సుశాంత్ను ప్రశాంతంగా ఉండనివ్వండి..మరణం వెనుకున్న కారణాన్ని కనుక్కోనివ్వండి,డైరెక్టర్ సుదీర్ఘ పోస్ట్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తరువాత ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్రెషన్ అనే వ్యాధిని నిర్మూలించాలని, డిప్రెషన్కు గురి కాకుండా ఉండాలని అందరూ చెబుతున్నారు. అందరూ కలిసి ఏకాకిని చేయకండని సూచిస్తున్నారు. డిప్రెషన్కు గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై సినీ లోకంతో పాటు సోషల్ మీడియా ప్రపంచం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్క సెలెబ్రిటీ డిప్రెషన్ గురించి స్పందించారు. అనుష్క, దీపికా పదుకొణె వంటి వారు డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలో చెప్పుకొచ్చారు. తాజాగా ఓ డైరెక్టర్ సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. డిప్రెషన్ గురించి చెప్పుకొచ్చాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొదటిసారి దైవ దీక్షలో అక్కినేని హీరో.. డిప్రెషన్లోకి వెళ్లకుండా కఠోర నిర్ణయం!
అక్కినేని యువ హీరో అఖిల్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఫ్యాషన్ వరల్డ్ కి అలాగే స్నేహితులకు, పార్టీలకు పబ్ లకు దూరంగా ఉండాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నేటితరంలో కూడా ఇలాంటి కుర్రాళ్ళు ఉంటారా? అది కూడా ఫ్యాషన్ లైఫ్ కి అలవాటు పడ్డ అఖిల్ లాంటి యువకుడు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











