లహరి షారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి, ఆమె యాంకర్ గా మోడల్ గా కూడా పని చేస్తున్నారు. అయితే ఆమె ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పేరు తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఆమె జూన్ 5, 1995ణ హైదరాబాద్, తెలంగాణలో జన్మించింది. 2014 లో, లహరి 'సారీ నాకు పెళ్లైంది' సినిమాతో నటిగా తన కెరీర్ను ప్రారంభించింది.
ఇక ఆ తరువాత 2016 లో, ఆమె ఈటీవీ తెలుగులో 'సెలబ్రేషన్స్' షోతో టెలివిజన్లో తన కెరీర్ను ప్రారంభించింది. తరువాత, ఆమె 'మహా' న్యూస్ ఛానెల్లో చేరారు మరియు 2017 నుంచి 2019 వరకు అందులోనే ప నిచేశారు. ఈ సమయంలో ఆమె మంచి పేరు తెచ్చుకోవడమే కాక మరియు అవసరమైన గుర్తింపు పొందింది.
ఆమె తదుపరి స్టూడియో ఎన్ న్యూస్ అనే ఒక న్యూస్ ఛానెల్లో 2019 లో క్రియేటివ్ హెడ్గా చేరింది. అదే సమయంలో, లహరి అర్జున్ రెడ్డి (2017), మళ్ళీ రావా (2017), పటేల్ SIR (2017), అజ్ఞాతవాసి (2018), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), U (2018) కథే హీరో వంటి వివిధ సినిమాల్లో కూడా కనిపించారు. ఆ తరువాత ఆమె తిప్పరా మీసం (2019), మరియు జోంబీ రెడ్డి (2021) వంటి సినిమాల్లో కూడా కనిపించారు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 5లో మూడవ కంటెస్టెంట్ గా లహరి షారి ఎంటర్ అయ్యారు