శ్రేయాకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి ఆమెకు ఆది గురువుగా మారి సంగీతంలో ఓన మాలు నేర్పారు. అలా కొంతకాలం సాధన చేసింది.కొంత కాలం తరువాత తమ క్లబ్ వార్షికోత్సవాలలో తొలిసారి రంగస్థలంపై ప్రదర్శననిచ్చింది. ఆరేళ్ల వయస్సులోనే కోటాలోని రాకేష్ శర్మాజీ, శ్రీ జయవర్ధన్ భట్నాగర్ వద్ద హిందుస్తానీ శాస్ర్తీయ సంగీతంలో ప్రావీణ్యం గడించారు. శిక్షణా కాలంలోనే హిందీచిత్ర గీతాలను పాటడం, ప్రముఖ ప్లేబ్యాక్ గాయకుడు,పద్మ శ్రీ అవార్డు గ్రహీత కీశే కళ్యాన్జీ భై వద్ద ప్లేబ్యాక్ సింగింగ్లో ప్రావీణ్యం సంపాదించారు. 1997 ముంబైకి మకాం మార్చారు. కీశేముక్తా భిడేజీ వద్ద హిందుస్తానీ శాస్ర్తీయ సంగీతంలో శిక్షణను కొనసాగించారు.
1995: శ్రేయా ఘోషాల్ డిల్లీలో జరిగిన ఆల్ ఇండియా లైట్ వోల్ సంగీత పోటీలో జూనియర్ లెవల్లో గెలుపొందడంతో అమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలైన కళ్యాన్జీ-అనంద్జీ, రాజన్-సజన్ మిశ్రాలు శ్రేయాలోని ప్రతిభను గమనించారు.
1996: టీవిఎస్ సారేగామా కార్యక్రమంలోని 75వ ప్రత్యేక బాలల ఎపిసోడ్లో పోటీలో పాల్గొని విజయాన్ని సాధించారు.
1998: మరాఠీ, బెంగాలీ తదితర ప్రాంతీయ భాషల్లో రికార్డింగ్లలో పాల్గొనటం ప్రారంభించింది.
2000: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజలీలా భంసాలీ, సంగీత దర్శకుడు ఇస్మాయెల్ దర్బార్జీలు దేవడాస్ చిత్రంలో పాడేందుకు శ్రేయాను ఎంచుకున్నారు.
2002: దేవదాస్ చిత్రం ఆడియో విడుదలవ్వడంతో శ్రేయా ప్లేబ్యాక్ కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రం సాధించిన విజయం శ్రేయా కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తరువాత శ్రేయా కెరీర్ గ్రాఫ్ పైపైకి వెళ్ళింది.
దేవదాస్ చిత్రం విజయం తరువాత శ్రేయాకు మంచి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. వివిధ భాషల్లోని ప్రము సంగీత దర్శకులు శ్రేయాను అవకాశాలతో ముంచెత్తారు.అలా ప్రారంభమైన శ్రేయా ప్రస్థానం నేటికీ కొనసాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, అస్సామీ, బెంగాలీ, భోజ్పూరి, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, నేపాలీ, ఒరియా వంటి అనేక భాషల్లో పాడారు. తెలుగులో శ్రేయా పాడిన పాటలు యువతను విపరీతంగా అలరించాయి. నేటికీ శ్రేయా గాయనీ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోంది.
ఏ.ఆర్.రెహ్మాన్, హిమేష్ రేష్మియా, ఇళయరాజ, యువన్ శంకర్ రాజా, మణిశర్మ, ఆర్పి. పట్నాయక్ ప్రఖ్యాత సంగీత దర్శకుల కోసం పాడారు.