వై వి ఎస్ చౌదరి
Born on 23 May ఆంద్రప్రదేశ్
వై వి ఎస్ చౌదరి బయోగ్రఫీ
వై. వి. ఎస్. చౌదరి ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత 1998వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో రూపొందిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.
. ఆ సినిమా విజయం తరువాత అక్కినేని నాగార్జున మరియు నందమూరి హరికృష్ణ కథానాయకులుగా సీతారామరాజు, మహేష్ బాబు కథానాయకుడిగా యువరాజు సినిమాలను తెరకెక్కించాడు. తరువాత లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో నిర్మాతగా మారాడు. దాని తరువాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. దేవదాసుతో రామ్ మరియు ఇలియానా, రేయ్ తో సాయి ధరమ్ తేజ్ మరియు సైయామి ఖేర్ లను పరిచయం చేశాడు. తరువాతికాలంలో వీళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులుగా స్థిరపడ్డారు.