ఢమరుకం సినిమా యాక్షన్ రోమ్యాంటి కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా మిగిలిన రాక్షసుడు అంధకాసురుడు(రవిశంకర్). ఆ రాక్షసుడికి పంచభూతాలు ఆధీనంలో పెట్టుకుని సృష్టిని ఏలానన్నది జీవితాశయం. అందుకోసం వెయ్యి సంవత్సరాలకొక్కసారి జరిగే పంచగ్రహ కూటిమిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తెలుసుకుంటాడు. ఆమె మరెవరో కాదు పార్వతీ దేవి అంశంతో పుట్టిన మహేశ్వరి(అనూష్క). అయితే ఆ రాక్షసుడ్ని అడ్డుకోవటానకి, లోక కళ్యాణం చేయటానికి మల్లి కార్జున (నాగార్జున)జన్మిస్తాడు. చిన్నతనంలోనే కుటుంబాన్ని పోగొట్టుకున్న మల్లికార్జున... శివుడుపై ద్వేషం పెంచుకుంటాడు. తిరిగి మల్లికార్జున శివభక్తుడు ఎలా అయ్యాడు...అత్యంత బలశాలి అయిన ఆ రాక్షసుడ్ని ఎలా సంహరించాడు... మహేశ్వరిని ఆ రాక్షసుడు బారినుంచి ఎలా రక్షించాడు అనేది మిగతా కథ.