గీతాంజలి సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, గిరిజ, చంద్ర మోహన్, డిస్కొ శాంతి, విజయ్ చంద్ర, సుత్తి వేలు, సుమిత్ర తదితరలు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం నిర్వహించారు మరియు నిర్మాత ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.
కథ
ప్రకాష్ (అక్కినేని నాగార్జున) పరిచయంతో కథ మొదలవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే యువకుడు. కాలేజీ లో చదువుతుంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉంది అని తెలుస్తుంది. విరక్తి చెందిన ప్రకాష్ అన్నింటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపొతాడు. అక్కడ అతనికి గీతాంజలి (గిరిజ) పరిచయం అవుతుంది. గీతాంజలి తండ్రి ఊటీ లో పెద్ద వైద్యుడు. గీతంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరిని ఆటపట్టిస్తూ, నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక వ్యాధి తో బాధ పడుతుంది. అయితే ప్రకాష్ కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలొచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతుంది. ప్రకాష్, గీతంజలి ల మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ప్రకాష్కి వ్యాధి ఉన్న విషయం గీతాంజలికి తెలియదు. గీతకు ప్రకాష్ ఆరోగ్య పరిస్థితి తేలిసిన తర్వత చాలా భాధపడుంది. వాళ్ళు ఇంకా బ్రతకము అని తేలిసిన....పవిత్రమైన ప్రేమకు ఎప్పటికి చావు లేదు అని తేలపడమే మిగతా కథ.