ఖడ్గం సినిమా యాక్షన్ దేశభక్తి సంబందిన చిత్రం ఇందులో శ్రీకాంత్, రవి తేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత, బ్రాహ్మాజి, షఫి, ఉత్తేజ్, గిరి బాబు. రఘు బాబు, అహుతి ప్రసాద్, పృద్వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాత శంకర మధు మురళి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
కోటి (రవి తేజా) ఎలాగైన సినిమా లో నటించే అవకాశం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అజ్మాద్ (ప్రకాష్ రాజ్) ఇతను ఒక ముస్లీమ్ ఆటో నడుపుతుంటాడు..అలాగే అందరు కలిసి మత గోడవలు లేకుండా బ్రతకాలన్నది ఇతని ఆశయం... ఇతనికి తమ్ముడు అజార్ (షఫి) చిన్నప్పుడే వీళ్ళనుంచి తప్పిపోయి వుంటాడు. మసూద్ అనే ఐ ఎస్ ఐ టేర్రరిస్టు ని పోలీసులు అరేస్టు చేస్తారు...ఇతన్ని విడిపించుకోవడానికి టేర్రరిస్టులు హైదిరాబాదులో బాంబులు పెట్టాలనుకుంటారు...దానికి అజ్మాద్ తమ్ముడు అజార్ టేర్రరిస్టుల చేత ట్రైనింగ్ తీసుకోని హైదిరాబాదులో పెల్చాడానికి సిద్దపడతాడు కాని...రాధా క్రిష్ణ (శ్రీకాంత్) సీన్సియర్ మరియు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీస్ ఆఫీసర్...ఇతను గతం లో టెర్రరిస్టు మసూద్ ను పడుకోనే క్రమంలో తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుంది. మసూద్ ని వదిలిపెట్టక పోతే జన సంద్రం వున్న చోట టైం బాంబులు పెట్టుతారు...వాటి నుండి రాధా క్రిష్ణ మరియు కోటి, అజ్మాత్ ప్రజలను కాపాడానికి తమ ప్రాణాలకు తేగించి బాంబులు పేలకుండ చేసి..టేర్రరిస్టు అందరి ని చంపుతారు. ఇండియాలో వున్న హిందువులు ముస్లీంలు అన్నదమ్ముల కలిసి మెసిలి వున్న వారిని ఎవరు విడదీయలేరు అని మరో సారి చాటిచేప్పుతారు.