Don't Miss!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ట్రెండింగ్: పెళ్ళైన తర్వాత కూడా పడుకుంటావా, టీవీ నటికి షాక్.. పవనే సాక్ష్యం అంటూ రేణుదేశాయ్!
లక్ష్మి పార్వతి వచ్చాక జరిగిన సంఘటనల్ని ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ పూసగుచ్చినట్లు వివరించారు. చిన్మయి మరోమారు నెటిజన్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది. విజయ్ దేవరకొండతో రష్మిక ముద్దు సన్నివేశం చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ తెలిపాడు. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ పూజా రామచంద్రన్ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. తాను నటన నుంచి తప్పుకోటానికి గల సంచలన కారణాలని టివి నటి రిచా భద్ర బయట పెట్టింది. జబర్దస్త్ నిర్వాహకులకు జయసుధ షాక్ ఇచ్చారు. రాజశేఖర్ కుమార్తెపై శివాజీ రాజా చేసిన ఆరోపణలకు జీవిత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ లో నిలిచాయి.

ఆ నగల వల్లే ఫ్యామిలీలో పెద్ద గొడవ, అన్నీ మూటగట్టుకుని వచ్చేశారు: ఎన్టీ రామారావు డ్రైవర్ లక్ష్మణ్
ఎన్టీ రామరావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్గా పని చేయడంతో పాటు ఆయన చైతన్యరథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురి కావడానికి దారి తీసిన సంఘటనల గురించి వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లైంగికంగా వేధించిన వైరముత్తునే పెళ్లి చేసుకో... చిన్మయిపై షాకింగ్ కామెంట్
చిన్మయి చేసిన కామెంటుపై ఓ ట్విట్టర్ యూజర్ స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది. నిన్ను లైంగికంగా వేధించిన వైరముత్తుతో గొడవ లేకుండా ఉండటానికి ఒకటే మార్గం. నువ్వు ఆయన్ను పెళ్లి చేసుకో.. అంటూ సలహా ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘‘అమ్మా నేను నీ పక్షమే''... రేణు దేశాయ్ గురించి అకీరా, కాబోయే భర్త ఏమన్నారంటే!
'అలీతో సరదాగా' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ షోలో ఆమె తన సినిమా రెరీర్, పర్సనల్ లైఫ్, పిల్లలు, రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ షోలో హైలెట్ ఏమిటంటే... రేణు కుమారుడు అకీరా తన తల్లి గురించి సందేశం పంపడం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?.. రష్మి షాకింగ్ కామెంట్
సాధారణ జనాలు మాత్రమే కాదు.. కొందరు సినీ ప్రముఖులు కూడా 'జబర్దస్త్' షోపై మండి పడ్డ సందర్భాలు ఉన్నాయి. షో జడ్జి నాగబాబు సైతం గతంలో పలు సందర్భాల్లో కొన్ని స్కిట్లు శృతి తప్పిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తాజాగా మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగుకు వచ్చిన రష్మికి జబర్దస్త్ వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

విజయ్ దేవరకొండతో ముద్దు సమస్య కాదు... రష్మిక-రక్షిత్ బ్రేకప్కు అసలు కారణం ఇదే!
రష్మిక, రక్షిత్ శెట్టి విడిపోవడానికి ‘గీత గోవిందం' మూవీలోని ముద్దుసీనే కారణమనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో రష్మిక కిస్సింగ్ సీన్ చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే మరి వీరు విడిపోవడాని కారణమేంటి? తాజాగా ఇందుకు సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేను ఒప్పుకోలేదు.. అయినా చేయించారు, పవన్ కళ్యాణ్ గారే సాక్ష్యం.. రేణు దేశాయ్!
ప్రస్తుతం రేణుదేశాయ్ కి సంబంధించిన విషయాలు మీడియాలో హాట్ టాపిక్. రేణు దేశాయ్ ఏం మాట్లాడినా ఆ విషయాలు వైరల్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పుణేలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల రేణు దేశాయ్ అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది. ఈ ప్రోగ్రాంలో రేణు దేశాయ్ అలీతో అనేక ఆసక్తిక్రమైన సంగతులని పంచుకుంది. తెలుగులో నటించే అవకాశం ఎలా వచ్చింది, పవన్ కళ్యాణ్ తో పరిచయం లాంటి సంగతులని రేణు దేశాయ్ ప్రస్తావించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కెజిఎఫ్ నటుడితో పెళ్లి.. ఊహించని షాక్ ఇచ్చిన బిగ్బాస్ పూజ రామచంద్రన్!
నటి పూజా రామచంద్రన్ స్వామిరారా చిత్రంతో తెలుగులో గుర్తింపు దక్కించుకుంది. పలు చిత్రాల్లో పూజా నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో పూజ రామచంద్రన్ పలు చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ వేగం పెంచే పాత్రలు మాత్రం చేయలేదు. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తెలుగు బిగ్ బాస్ 2 లో హైలైట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ లో పూజ రామచంద్రన్ ఒకరు. పూజా రామచంద్రన్ తన ప్రియుడిని వివాహం చేసుకుని ఊహించని షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పెళ్లయ్యాక కూడా పడుకుంటావా అని అడిగారు.. కుటుంబమే నాకు ముఖ్యం, టీవీ నటి హాట్ కామెంట్స్!
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం తరచుగా చర్చనీయాంశం అవుతోంది. ఆడిషన్స్ సమయంలో, షూటింగ్ లొకేషన్స్ లో తమకు ఎదురవుతున్న వేధింపులని పలువురు నటీమణులు ధైర్యంగా ప్రస్తావిస్తునారు. బుల్లి తెర నటీమణులకు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. హిందీలో బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రిచా భద్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నటనకు గుడ్ బై చెప్పడానికి గల కారణాలని రిచా వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హీరోతో కలసి హాస్పిటల్లో నటి.. పెళ్ళికి ముందే గర్భం?
నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. త్వరలో మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలైకా గురించి మరో సంచలన వార్త ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మెగా ఫ్యామిలీలో తేజుకే ఎక్కువగా.. చిరంజీవి నైజం అలాంటిది, లేచి వచ్చాడు.. పోసాని!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువత నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. చిత్రలహరి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి ఆసక్తికర విషయాల వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వల్గర్ కామెడీ షోలో నేనా? డబ్బుకు కక్కుర్తి పడకుండా.. నిర్వాహకులకు జయసుధ షాక్
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. మరికొందరికి జీవనోపాధిగా మారింది. అలాంటి షో కోసం హెస్ట్గా ఉండమని జయసుధను సంప్రదిస్తే.. అందుకు ఆమె నిరాకరించిందంట.. వివరాల్లోకి వెళితే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా పిల్లలు నాకు పుట్టలేదు.. వారిద్దరు అలా జన్మించారు... నీతా అంబానీ వెల్లడి
ఎవరికైనా మాతృత్వ అనుభవాన్ని పొందాలనుకొంటారు. కానీ జీవితంలో గొప్ప అనుభూతికి లోనయ్యే ఆ కోరిక నీతా అంబానీకి నెరవేరలేదట. ఇషా, ఆకాశ్ అంబానీలు నా గర్భంలో పుట్టలేదని నీతా అంబానీలు వెల్లడించడం మీడియాలో సంచలనం రేపింది. ఇషా అంబానీ పెళ్లి అనంతరం నీతా అంబానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. నీతా ఇంటర్వ్యూ వివరాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇద్దరు టీవీ తారల దుర్మరణం.. షూటింగ్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మరో ఇద్దరికి గాయాలు
తెలుగు టెలివిజన్ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ముత్యాల ముగ్గు సిరియల్కు సంబంధించిన ఇద్దరు వర్థమాన తారలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరు మృత్యువాత పడ్డారు. ఈ కారు ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఈ వార్తతో టెలివిజన్ నటులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వివాదంలోకి రాజశేఖర్ కూతురు.. జీవిత దిమ్మ తిరిగే జవాబు.. శివాజీ రాజా వర్గానికి రిటర్న్ గిఫ్ట్!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల పూర్తయిన తర్వాత కూడా నరేష్ వర్గానికి, శివాజీ రాజా వర్గాని మధ్య అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు బురుద జల్లుకోవడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నాడు. తాజాగా రాజశేఖర్ కూతురుపై నిరాధారమైన ఆరోపణలు చేసి శివాజీ రాజా బుక్ అయ్యాడు. ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇంతకు ఏమైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రెండేళ్లుగా నన్ను మానసికంగా... దారుణంగా.. పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు!
మానసిక క్షోభకు గురిచేస్తున్నాయంటూ పలు యూట్యూబ్ ఛానెళ్లపై నటి పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొద్దికాలంగా వాస్తవాలు తెలుసుకోకుండా నా గురించి చెడుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తన ఫిర్యాదును సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానెళ్ల కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి