X
Home టాప్ లిస్టింగ్

వెండి తెర‌పై చెర‌గ‌ని సంత‌కం.. సౌంద‌ర్య‌

Author Administrator | Published: Tuesday, July 18, 2023, 01:01 PM [IST]

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్న న‌టీన‌టులు ఎంద‌రో! అలాంటి వారిలో హీరోలు, హీరోయిన్స్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిసులున్నారు. హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే ఎక్కువ మంది గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం అవుతుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్ర‌మే ఓ వైపు పెర్ఫామెన్స్‌, మ‌రో వైపు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుని చెర‌గ‌ని ముద్ర వేసిన‌వారు మాత్రం చాలా కొద్ది మంది మాత్ర‌మే. అలాంటి కొద్ది మందిలో టాలీవుడ్‌కి చెందిన సౌంద‌ర్య ఒక‌రు.


cover image

సౌంద‌ర్య అస‌లు పేరు సౌమ్య‌. కోలారు జిల్లా ముళ భాగ‌ల్‌లో జూలై 18 1971న‌ జ‌న్మించారు. ఎం.బి.బి.ఎస్ చ‌దువుకుంటున్న స‌మ‌యంలో గంధ‌ర్వ అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమా 1992లో రిలీజైంది. అక్క‌డి నుంచి నెమ్మ‌దిగా సినిమాలు చేసుకుంటూ వ‌చ్చారు. సెకండ్ హీరోయిన్‌గా ప‌లు చిత్రాల్లో న‌టించిన ఆమెకు అమ్మోరు సినిమా మంచి బ్రేక్‌నిచ్చింది. అక్క‌డి నుంచి ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంతో పాటు హిందీలోనూ ఆమె నటించారు. 

అమ్మోరు, పెద‌రాయుడు, న‌ర‌సింహ, పెళ్లి చేసుకుందాం, అన్న‌య్య‌, స‌ర్దుకుపోదాం రండి, దొంగాట‌, ప‌విత్ర బంధం, ఆరోప్రాణం, 9 నెల‌లు వంటి ప‌లు చిత్రాల్లో న‌టన‌తో ఆక‌ట్టుకుంటూనే గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనూ న‌టించి శ‌భాష్ అనిపించుకుంది. వివాదాల‌కు దూరంగా ఉంటూ అంద‌రి హీరోల‌తో సినిమాలు చేస్తూ ప్రొడ్యూస‌ర్స్‌ను ఇబ్బంది పెట్ట‌కుండా మంచి పేరును సంపాదించుకుంది. 100 చిత్రాల్లో ఆమె న‌టించింది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జినీకాంత్‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున స‌హా అన్నీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోని హీరోల‌తో ఆమె న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

 

తెలుగు ప్రేక్ష‌కులు మ‌హాన‌టి సావిత్రిని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. ఆ త‌ర్వాత ఆ రేంజ్ ఇమేజ్‌, క్రేజ్‌ను ద‌క్కించ‌కుఉన్న న‌టి సౌంద‌ర్య మాత్ర‌మే అన‌టంలో సందేహం లేదు. 12 ఏళ్లు మాత్రమే ఆమె హీరోయిన్‌గా కొన‌సాగింది. ఈ జ‌ర్నీలో ఆమె 6 ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌నుఅందుకున్నారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి (తెలుగులో మహిళ), ద్వీప (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర చిత్రాలకు అందుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మూడు ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డుల‌ను గెలుచుకున్నారు.  సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు సౌందర్యకు నవరసనటన మయూరి అనే బిరుదును ఇచ్చి స‌త్క‌రించారు. 

న‌టిగా సినిమాల‌తో మెప్పించిన ఆమె ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించారు. 2004లో బీజేపీ పార్టీ కోసం ప్ర‌చారం చేయ‌టానికి అంగీక‌రించారు. ఆ ప్ర‌చార కార్య‌క్ర‌మాల కోసం.. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు న‌గ‌రంలోని జక్కూరు విమానాశ్రయం చేరుకున్నారు.  కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో త‌న సోద‌రుడు అమ‌ర‌నాథ్‌తో  క‌లిసి బయలుదేరారు. ఆ విమానం గాల్లోకి ఎగిరిన‌ కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలి స‌జీవ ద‌హ‌న‌మై చనిపోయారు.

న‌టిగా ఇంకెంతో ఉన్న‌తిని చూడాల్సిన ఆమె అనుకోకుండా దుర్మ‌ర‌ణం పాల‌వ‌టం అంద‌రినీ క‌ల‌చివేసింది. యావ‌త్ సినీ ప్ర‌పంచం దిగ్భ్రాంతికి లోన‌య్యింది. అయితే ఆమె న‌ట‌నతో ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో నిల‌చిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+