twitter

    రష్మిక మందన్న బయోగ్రఫీ

    రష్మిక మందాన ఏప్రిల్ 5 1996లో జన్మించారు. రష్మిక  భారతీయ చలన చిత్ర నటి మరియు మోడల్. ఆమె నాగ శౌర్య కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు చిత్రం. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. 

    రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 

    రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు.

    సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆప్ం ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుంది. దాంతో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి.. 2016లో కన్నడ సినిమా ‘కిర్రీక్ పార్టీ’ సినిమాతో తెరంగేట్రం చేసింది.

    వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరో గా రూపొందిన ఛలో అనే పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విపరీతంగా పెరిగి పోయింది . ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది


    రష్మిక మందన్న.. తెలుగులో ‘ఛలో’ మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

    సౌత్ సినిమాలతో ఫిల్మ్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన నార్త్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రష్మిక మందన పుష్ప,గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది.

    కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది.

    కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X