చావు కబురు చల్లగా (2021)(U/A)
Release date
19 Mar 2021
genre
చావు కబురు చల్లగా స్టోరి
చావు కబురు చల్లగా సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, లావణ్య త్రిపాటి, ఆమని, భద్రం, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, అనసూయా భరద్వాజ్, జబర్దస్త్ మహేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కౌషిక్ పెగాల్లపటి వహించారు. బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జాక్స్ బెజోయ్ అందించారు.
కథ
బస్తీ బాలరాజు ( కార్తీకేయ గుమ్మకొండ) శవాలను మోసుకెళ్తే వాహనం డైవర్. జల్సాగా ఎలాంటి బాధ్యతలను పట్టించుకోకుండా జీవించే బాలరాజు.. ఓ చావులో భార్తను కోల్పోయిన మల్లిక (లావణ్య త్రిపాఠి)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మల్లికతోపాటు కుటుంబ సభ్యులు నిరాకరించినా బాలరాజు వెంటపడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో భర్త ఉండగానే వివాహేతర బంధం పెట్టుకొన్న తల్లి గంగమ్మ (ఆమని) విషయం బాలరాజుకు తెలుస్తుంది. భర్తను కోల్పోయిన వితంతు మల్లికను బాలరాజు ప్రేమ, పెళ్లికి ఒప్పించాడా? మల్లిక మామ (మురళీశర్మ), ఆయన కుటుంబంతో బాలరాజు వ్యవహరించిన తీరు ఎలా ఉంది? భర్త ఉండగానే మోహన్ (శ్రీకాంత్ అయ్యంగార్)తో గంగమ్మ ఎందుకు వివాహేతర బంధాన్ని పెట్టుకొన్నది? తన తల్లి వివాహేతర బంధం గురించి తెలిసిన బాలరాజు రియాక్షన్ ఏమిటి? ఏ పరిస్థితుల్లో తండ్రి బతికి ఉండగానే తన తల్లికి పెళ్లి చేయాలని నిర్ణయించుకొన్నాడు? చివరకు మల్లికను ఒప్పించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే చావు కబురు చల్లగా సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie చావు కబురు చల్లగా with us? Please send it to us ([email protected]).